Friday, June 20, 2014

దేవుడు చేసిన మానవ అకార నిర్మాణపు రహస్యములు

1) మానవ జన్మను గురించి ప్రపంచములో వ్రాయబడిన పుస్తకాల అన్నిటిలో కన్న శ్రేష్టమైనది, సాక్షాత్తు దేవుడు మన గురించి వ్రాయించిన ఏకైక గ్రంధమైన Bible లో చెప్పబడింది. Scientists అయితే మనిషి కోతి నుండి వచ్చాడని, ఒకప్పుడు కోతులు మనుషులుగా మారిపోయారని చెప్తున్నాడు. మేధావులు కూడా ఏదో మనిషి పుడుతున్నాడు, బతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు మరియు పుట్టుక ముందు ఏమి లేదు-మరణించిన తర్వాత ఏమి లేదు అని అంటున్నారు. మానవ జన్మ గురించి మనిషికి తెలియని మహా జ్ఞాన సంగతులు మన చేతులో ఉంటున్న Bible లోనే దేవుడు వ్రాయించాడు. మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే భూమి మీద రాక ముందు తల్లి గర్భములో, తల్లి గర్భములో రాక ముందు తండ్రి  గర్భములో, తండ్రి గర్భములో రాక ముందు మన పితరుల గర్భములో, ఒకప్పుడు ఆదాములో, అంతకంటే ముందు దేవునిలో పరలోకములో ఉన్నవారము మనము. అనగా పరలోకములో దేవుని నుండి మట్టి శరీరంలోకి వచ్చి, ఆ తర్వాత మనుషుల ద్వారా ప్రయాణించి దేవుడు అనుకున్న రోజు ఈ భూమి మీదకు వచ్చాము.

2) పుట్టుక ముందు మన చరిత్ర దేవునిలో ఉన్న చరిత్ర. పరలోకములో ఉంటున్న మనం కొద్ది కాలం ఈ భూమి మీద దేవునికి ఇష్టకరముగా జీవించుటకు వచ్చాము. 6 days మనకు కావలసినది అన్ని సృష్టిలో కలిగించి,మనలని ఈ భూమి మీదకు పంపుట వెనుక గల ఉద్దేశము ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయాలనీ (ఎఫేసి 2:10). మనల్ని ఈ భూమి మీదకు పంపుతూ ఒక ఉద్దేశాన్ని కలిగియున్నాడు.అస్సలు మన జన్మ గురించి మొదట బాగా తెలియాలి.ఎందుకంటే ఈ చిన్న జీవితములో ఏదో తిని,త్రాగి చావాలనుకుంటూన్నాడే తప్ప దేవుడు మన గురించి ఏంత కష్టపడ్డాడని, ఏంత ఆలోచిస్తూన్నాడనే సంగతులు తెలిస్తే మనం అయన గురించి ఆలోచించడానికి ఇష్టపడుతాము.

3) యెషయ 44:1,2- నిన్ను సృష్టించి, గర్భములో నిన్ను నిర్మించి, నీకు సహాయము చేయువాడైన యెహోవా. ఒక కన్న తండ్రిగా నిన్ను కావాలనుకుని ,నీ కోసం నేను ఏంత కష్టపడ్డానో నీకు తెలియాలి అని ఈ మాట చెపుతున్నాడు దేవుడు. అప్పుడప్పుడు తల్లితండ్రులు వారి పిల్లలతో మేము ఏంత కష్టపడితే నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్తారు. వారు పడ్డ కష్టాన్ని పిల్లలకు తెలియజేస్తే మా తల్లితండ్రులు నా కోసము ఇంతగా కష్టపడ్డారు గనుక వాళ్ళు కోసము ఏమన్నా చేయాలన్న ఆలోచన వస్తుంది. అలానే పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలకు తన కష్టాన్ని గూర్చి తెలియజేస్తున్న వచనము పై వచనమ. మానవ జన్మ యొక్క రహస్యాన్నియెషయ44:1, 2లో చెబుతున్నాడు.  దేవుడు మన గురంచి పడిన కష్టాన్ని ఈ వచనములో చెప్తున్నాడు. ఈ రోజు చక్కటి మానవ ఆకారముతో ఉన్న మనిషికి ఈ ఆకారం ఎలా వచ్చిందో తెలియదు. తెలియదు కాబట్టి నాది నాది అనుకుంటూ తనకు ఇష్టమైనట్టు బ్రతకడానికి ఆలోచిస్తున్నాడు.

4) యెషయ 44:1,2 లో చెప్పబడినట్టుగా దేవుడు అస్సలు ఎలా సృష్టించాడు, ఎలా నిర్మించాడు,ఎలా సహాయము చేశాడు అన్న లోతులకు వెళ్దాము.ఒక్కొక్కటిగా ఆలోచిద్దాము. దేవుడు చెప్పిన ఈ సృష్టించుట, నిర్మించుట, సహాయము చేయుట అను మాటలు అర్థము కావాలి. ఎలా, ఎప్పడు, ఎక్కడ సృష్టించాడో, నిర్మించాడో, సహాయము చేసాడో చూద్దాము.
 
సృష్టించుట:
మనల్ని సృష్టించడం అంటే ఏంటి? ఎక్కడ, ఎప్పుడు, ఎలా సృష్టించబడ్డామో ఆలోచించాలి.గలతీ 1:15-తల్లి గర్భము నందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరచి అంటే ప్రత్యేకపరుచుకున్నాడట. వాస్తవముగా ప్రత్యేకించబడిన వారే ఈ భూమి మీదకు వస్తారు. తల్లి గర్భములో పడ్డవారు అనేక మంది కానీ ప్రత్యేకింపబడిన వారు కొద్ది మందే. కోట్లను కోట్ల వీర్య కణాలు తల్లి గర్భాములోకి వెళ్తాయి కానీ తల్లి గర్భములో ఉన్న అండం ఒకే ఒక్క కణంనే స్వీకరిస్తుంది. ఆ స్వీకరించబడిన కణం నువ్వు. నువ్వు అనబడుతున్న కణం ఆ రోజు తల్లి అండంతో కలవకపోతే నువ్వు లేవు. తండ్రిలో నుంచి తల్లి లోనికి వెళ్ళుతున్న వీర్యకణాలు సుమారు 50 కోట్లు. 50 కోట్లలో ఒక్క కాణానివి నువ్వు. ఈ భూమి మీదకు రావడానికి ఏంత పోటి జరిగిందో ఆలోచించండి. 50 కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరిచి ,నిన్ను కావాలనుకున్నాడు దేవుడు. అప్పుడు సృష్టింపబడ్డావు.నువ్వు భూమి మీదకు వచ్చావంటే 50 కోట్ల కణాలలోనుంచి నిన్ను ప్రత్యేకపరచి సృష్టించుకున్నాడు. కేవలము నీవు తన కోసము కావాలని, తన కోసము బ్రతకాలని.

నిర్మించుట - సహాయము చేయుట:
(a) తల్లి గర్బము నుండి బయటకు రావాలంటే ఒక సరియైన ఆకారం ఉండాలి. నిన్ను సృష్టించిన తర్వాత దేవుడు తల్లి గర్భములో నీకు నిర్మాణం ఇవ్వడానికి ప్రారంభించాడు.అనగా ఒక మహా కట్టడాన్ని చేపట్టాడు. మానవ ఆకారము అనే మహా కట్టడాన్ని ప్రారంభించడానికి తల్లి గర్భము అనే క్రేంద్ర స్థానoలో ప్రారంభించాడు.నిన్ను సృష్టించక ఆకారం ఇవ్వడానికి మహా నిర్మాణాన్ని చేపట్టాడు. యోబు10:11 చర్మముతోను, మంసముతోను నీవునన్నుకప్పితివి. ఎముకులతోను, నరము లతోను నన్ను చేసితివి. అనగా మానవ అకార నిర్మాణానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము, మంసము, ఎముకులు, నరాలు. నిర్మాణము అన్నాడు గనుక మన కళ్ళ ముందు ఉన్న నిర్మాణాలు ఆలోచిద్దాము. ఉదాహరణకు ఒక ఇంటి నిర్మాణాన్ని చెప్పటడానికి మనం స్థలము ఎంపిక చేసుకోవాలి. స్థలము తర్వాత house plan కావాలి. తర్వాత కావాల్సిన పదార్ధాలు అనగా పునాదులు వేయడానికి రాయి, cement, iron, water, sand ఇలా అన్ని కావాలి.పునాది వేసిన దగ్గర నుంచి slab వేసే వరకు పదార్ధాలు కావాలి. మానవ నిర్మాణము వీటితో కట్టితే కుదరదు కదా.

(b) మనవునిని కట్టడానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము, మంసము, ఎముకులు, నరాలు. గర్భములో నిన్ను సృష్టించిన తర్వాత నిర్మించడానికి దేవుడు ఉపయోగిస్తున్న పదార్ధాలు ఇవన్ని మానవ ఆకారము దేవుడు ఇస్తే దేవుడు చేస్తే, నిర్మిస్తే వచ్చింది. చర్మము లేకపోతే చూడలేము అని చర్మాన్ని మాంసపు ముద్డపై కప్పాడు. ఎముకులను మాంసము మధ్యలో దృడముగా ఉండడానికి పెట్టాడు. ఇల్లు కట్టేటప్పుడు iron rods పెట్టి pillarsకి కంకర cement వేస్తారు దృడముగా ఉండడానికి. తల్లి గర్భము అనే నిర్మాణ స్థలాన్ని ఎంచుకుని అక్కడ మాంసము మధ్యలో bones use చేశాడు. bones లేకపోతే మన ఆకారము ఒక మాంసపు ముద్దలా ఉంటుంది. bones లేకపోతే ఏ అవయవము కూడా కదలదు.లోపల bones ఉంటేనే అవయవాలు కదులుతాయి.


(c) మన లోపల రక్త నరాలు ఎన్ని ఉన్నాయో చూస్తే భూమిని ఒక సారి చుట్టూ వచ్చే అంతగా ఉన్నాయి. bonesకి అనుకుని ఉంటాయి. తల్లి గర్భములో దేవుడు ఏంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క స్థలములో అమర్చాడు. ముక్కు, కళ్ళు,చె వులు ఇలా అన్ని వాటి వాటి స్థానాలలో స్థిరపరిచాడు. భూమి మీదకు వచ్చిన తర్వాత అమ్మ మనకు ఆహారమును తినిపించింది. మరి కడుపులో ఉన్నప్పుడు మనకు ఎవరు తినిపించారు? తల్లి గర్భములో ఉన్న నీకు ఆహారము,గాలి ఎలా వచ్చింది? ఎవరు సహాయము చేసారు? దేవుడే చేశాడు. భూమి మీదకు వచ్చాక అమ్మ సహాయము చేసింది కానీ భూమి మీదకు రాక ముందు నువ్వు తినడానికి, త్రాగడానికి, పిల్చుకోవడానికి దేవుడే సహాయము చేశాడు.

5) అయన పుట్టిస్తే వచ్చిన నీవు వచ్చిన తర్వాత తన కోసము ఆలోచిస్తున్నావా? యెషయ1:2- ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము. నేను పిల్లలను పెంచి గోప్పవరినిగా చేసితిని.వారు నా మీద తిరుగబడియున్నారు. మనిషికి తన జన్మ రహస్యము అర్థము కాక దేవునిపై తిరుగబడుతున్నారు. దేవుడు మనల్ని సృష్టించిన సంగతి, నిర్మించిన సంగతి,సహాయము చేసిన సంగతి మరచిపోయి తిరగబడుతున్నాడు. మన అవయవాలు దేవుని కొరకు use చేస్తున్నామా? రోమా12:1,2- సజీవ యగాముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడి. మన కన్నులను దేవుని వాక్యమును చదువుటకు,మన చెవులను దేవుని మాటలు వినుటకు, మన కళ్ళు, చేతులు దేవుని పని కొరకు వాడబడుతున్నాయా లేక లోక సంభంధమైన పాపాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయా? మనకు కలిగియున్న ఆకారాన్ని ఎవరు ఇచ్చారు,ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే మన జన్మ ఎందుకో అర్థమవుతుంది మరియు ఈ జన్మలో ఏమి చేయాలో అర్థమవుతుంది.

6) రోమా 6:12- కాబట్టి శరీర దురశలకు లోబడునట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఎలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.అయితే మృతులలో నుండి సజీవులమనుకుని, మిమ్మును మిరే దేవునికి అప్పగించుకోనుడి. మీ అవయవాలను నీతి సాధనాములుగా దేవునికి అప్పగించుడి. అనగా ఈ వచనములో మన body parts దేవుని కొరకు ఉపయోగపడాలి అని అర్థమయింది. మన mind-దేవుని గురించి ఏమి చేయాలనీ ఆలోచించాలి,మన eyes- దేవుని వాక్యమును చదవడానికి ఉపయోగపడాలి, మన నోరు- దేవుని మాటలు ప్రకటించుటకు ఉపయోగపడాలి, మన కాళ్ళు,చేతులు- దేవుని పని కొరకు ఉపయోగపడాలి. అందుకే మనల్ని సృష్టించి, నిర్మించి and ఇప్పటి వరకు సహాయము చేస్తున్నాడు అయన కొరకు బ్రతకాలని.

Thursday, June 12, 2014

క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా?


1) భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయస్సులోనే చనిపోయినా, తక్కువ కులంలో పుట్టినా, కడు పేద కుటుంబములో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా, తను కోరుకున్నది నెరవేరకపోయిన వీటి అన్నిటికి కారణము మన “నుదిటి మీద రాతే(తల రాతే) అన్న భావన ప్రజలలో నాటుకుపోయింది.

2) ఒక నూతన జంట వివాహము తరువాత విహార యాత్రకు బయలుదేరినప్పుడు driver నిర్లక్షం వల్లనో, మితి మీరిన వేగం వల్లనో ప్రమాదము సంభవించి వరుడు మరణిస్తే ఆ మరణించిన వరుడి తల్లికి ఒకే బిడ్డ అయితే ఆ తల్లి తన బిడ్డ శవం ముందు కుర్చుని పలికే రోదన ధ్వనులలో ఎక్కువ శాతం దేవుడినే ధుషిస్తూ, శాపనార్ధాలు పెడుతూ – దేవుడా లోకములో ఇంత మంది బిడ్డలుండగా నీకు నా బిడ్డే కనిపించాడా? అన్యాయముగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదయ్యా అని అంటూ విధవరాలుగా మారిన నవ వధువును ఉద్దేశించి నీ రాత బగలేదమ్మా, ఇది దేవుడు రాసిన రాతే, విధి వ్రాతను తప్పించుకోవడము ఎవరి తరం గాదు అనే మాటల సందర్భాన్ని మనము గమనించొచ్చు.

3) ఒక్కొకరికి ఒక్కో రకమైన తల రాతను దేవుడు వ్రాస్తాడా? ఒక వేళ అలా వ్రాస్తే దేవుడు పక్షపతి అవ్వుతాడు. ఒకడు పేదరికములో పుట్టాలని, ఒకడు సంపన్న కుటుంబములో పుట్టాలని దేవుడు ఏర్పాటు చేస్తాడా? ఒకడు చెడ్డవాడుగా, ఇంకొకడు మంచివాడుగా బ్రతకాలని దేవుడే నియమిస్తాడా? ఇలా అయితే దేవుడు పక్షపాతిగా వ్యవహరించినట్లు. కానీ దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో చూస్తే అపోకార్య 10:34- అందుకు పేతురు నోరు తెరిచి ఇలా అనెను-దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా నేను గ్రహించాను అని అంటున్నాడు.

4) వృత్తిలో మార్పులు, చేర్పులకు దేవుని రాతకు సంభందము లేదని, మన జీవన స్థితిగతులను దేవుడు నిర్ణయించడని, అది వారి వారి పూర్వికుల పరిస్థితిని బట్టి ప్రదేశాలను బట్టి ఆసక్తిని బట్టి ఉంటుందని అర్థము చేసుకోవచ్చు. దేవుడు సమానంగా అన్ని కల్పించాడు. కానీ వాటి వినియోగములోనే మనకు వ్యత్యాసము కనిపిస్తుంది. అందరికి ఉపకారము చేయాలన్న దేవుని లక్షణము చూస్తే కీర్తన 145:9- దేవుడు అందరికి ఉపకారి అని ఉంది. దేవుడు కొందరికే ఉపకారి కాదు. ఆయనలో పక్షపాతి స్వభావము లేదు. మత్తయి 5:45- అయన చెడ్డవారి మీదను, మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నితిమంతుల మీదను, ఆ నితిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

5) ఇంతకు దేవుడు నుదిటి పై వ్రాత వ్రాసాడంటారా? ఆ సంగతి అర్థమైతే ఎన్నో చిక్కు ముడులు విప్పబడుతాయి. నుదిటి రాత అంటున్న వారికీ నుదుటిపై ముడతలు తప్ప ఏమి కనిపించవు. ఏ భూతద్దంతో వెతికిన –చర్మపు ముడతలు. స్వేద రంధ్రాలు తప్ప వ్రాత దొరకదు. ఒక వేళా ఉందని కాసేపు అనుకున్న అయన వ్రాసిన వ్రాత వీరికి అర్థం అవుతుందా? ఇంతకు ఏ భాషలో ఉంది ఈ వ్రాత? దినిని బట్టి ఎవ్వరు నుదిటిపై వ్రాత లేదు అని సామాన్యముగా అర్థము చేసుకోవచ్చు. ఇంతకు దేవుడు వ్రాసుకున్నది నుదిటి మీదేనా అని bibleలో చూస్తే హెబ్రీ 10:7- అప్పుడు నేను- గ్రంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. అంటే దేవుడు మన గురించి వ్రాసుకున్నది గ్రంధపు చుట్టలో అని చెప్పబడింది కానీ నుదిటి మీద కాదు అని అర్థమయింది.

6) కీర్తన 139:16-నియమింపబడిన దినములలో ఒకటైనాను కాకమునుపే నా దినములన్నియు( నా భవిష్యత్తు ) నీగ్రంధములో లిఖితములాయేను. ఇక్కడ కూడా అదే విషయం ప్రస్తావించాడు. అనగా మన future దేవుని గ్రంధములో వ్రాయబడింది. పై రెండు వచన సందర్భాలు(హెబ్రీ 10:7, కీర్తన 139:16) ఒకటి క్రీస్తు గురించి, మరొకటి దావీదు గురించి అని అనుకుని నా గురించి మాత్రము ఏమి వ్రాయలేదు అని అనుకోకండి. దేవుడు ఆలోచన తన పిల్లలపై ఉన్నతంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనగా job, పెళ్లి, పిల్లలు, సంపద, ఇల్లు వీటి గురించి దేవుడు వ్రాయలేదు. కానీ దేవుడు అందరి గురించి వ్రాసుకున్న ఒకే రాత(ఒక్కొకరికి ఒక్కో రాత కాదు) ఏమిటో bible లో చూద్దాము.

7) ఎఫేసి 1:4-6- మనము దేవుని ఎదుట పరిశుద్దులముగా ,నిర్దోషలముగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి వ్రాసుకున్నాడు. దేవుడు వ్రాసుకున్న ఉన్నతమైన వ్రాత ఏమిటంటే పరిశుద్దుడిగా ,నిర్దోషిగా బ్రతకడం అంతే తప్ప పేదవాడిగా బ్రతుకు, ఫలానా job చేస్తూ బ్రతుకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దేవుడు వ్రాసుకోలేదు.ఇంతకు మనము ఏ పనులు చేసి పరిశుద్దముగా ,నిర్దోషిగా బ్రతకమని దేవుడు వ్రాసుకున్నాడో bible లో చూస్తే ఎఫేసి 2:10- వాటి యందు మనము నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు ( వాక్యపు పనులు) చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై, అయన ( దేవుడు) చేసిన పనియై యున్నాము.

8) మనము చేయవలసిన వాక్యపు పనులు( వాక్యానుసారమైన జీవితము జీవించాలని) వ్రాసుకున్నాడు.దేవుడు సిద్దపరచిన సత్ క్రియలను మనము చేయాలి కానీ అయన మనతో చేయించడు. సమాజములో అవకాశవాదులు తాము అనుకున్నది సాదించుకుంటే “తమ గొప్ప” అని చెబుతారు. కానీ అనుకున్నది సాదించుకోలేకపోతే “ దేవుని రాత అని తప్పించుకుంటూ ఉంటారు. ఉదా:: సంతానము కలిగేటప్పుడు మగ పిల్లవాడు పుడితే – నేను చెప్పినట్లే మగ పిల్లవాడు పుట్టాడు చూసారా అనే అని అంటారు. అనుకోని విధముగా ఆడపిల్ల పుడితే ఏమి చేద్దాము, దేవుడు రాసిన రాత ఎవ్వరు తప్పించలేరు అని అంటారు.అలాగే bike racing పోటిలలో మితి మీరిన వేగంతో bike నడుపుతూ, పోటిలలో గెలిస్తే చూసారా నా power అని అంటాడు. అనుకోని ప్రమాదము జరిగి leg,hand విరిగితే దేవుడు ఇలా రాసి పెట్టాడు అని అంటారు. handle మన చేతుల్లో ఉందా?? దేవుని చేతుల్లో ఉందా ఆలోచించండి.

9) దేవుడు అందరికి ఉపకారి అయినప్పుడు ఒకరికి చెడు జరగాలని, చెడుగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తాడంటారా? ఒక్క మాటలో చెప్పండి- మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని దేవుడు రాత రాస్తాడంటారా? ఉన్న భార్యను వదిలి రెండో పెళ్ళికి సిద్దమవ్వమని దేవుడు రాత రాస్తాడంటారా?? మితి మీరిన వేగముతో వాహనమును నడిపి ప్రమాదము కొని తెచ్చుకోమని దేవుడు నుదిటిపై లిఖించాడంటారా? ఇవన్ని మనము చేసుకుంటున్న వివిధమైన స్వయము పనులు. దేవుడు ఇలా బ్రతకమని ఎప్పుడు చెప్పడు. చేయించడు.

10) ప్రసంగి 7:29- దేవుడు నరులను యదర్ధవంతులుగా పుట్టించెను గానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనియున్నారు. అనగా దేవుడు మనిషిని యదార్థవంతంగా పుట్టించాడు, యదార్ధవంతుడుగా, పరిశుద్దుడుగా, నిర్దోషిగా వాక్యపు పనులతో బ్రతకమని తన గ్రంధములో వ్రాసుకున్నాడు. మనము ప్రయత్నము చేస్తే దేవుని తోడ్పాటు ఉంటుంది. అంతే తప్ప ప్రయత్నము ఏమి చేయకుండా, అయన రాసినట్లు జరగకుండా మానదు అని ఇంట్లో కూర్చుంటే ముద్ద కంచంలోకి రాదు. కనుక ప్రతి పనికి మన ప్రయత్నము అవసరం. ఈ విధముగా పని విషయమై ప్రయత్నము చేయమనేదే దేవుని చిత్తము కానీ నేడు అందరు దేవుని చిత్తమైతే చేస్తాను, చూస్తాను, వస్తాను, కొంటాను, ఇస్తాను అని వారికీ తెలియకుండానే నుదిటి రాతపై నమ్మికయుంచుతున్నారు.

11) దేవుడు రాసుకున్న విధముగా నడిచి చూపిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని గ్రంధపు చుట్ట్టలో రాసుకున్న వ్రాతకు బిన్నముగా ప్రవర్తించి దేవుడు ఏర్పరిచిన మార్గము నుంచి తప్పిపోయిన యుధా ఉన్నాడు. మత్తయి 26:24- ఈ సందర్బ్భాములో దేవుడు క్రీస్తును గురించి వ్రాసుకున్నట్లు క్రీస్తు పోవుచున్నట్లు గమనించగలం. వ్రాయబడిన ప్రకారం దేవుడే జరిగించడం లేదు గానీ కరిస్తే అలాగున వెళ్లుచున్నాడు. దేవుడు దీనికి సహకరిస్తూన్నాడు .ప్రయత్నము క్రిస్తుది. సహాయము దేవునిది. వ్రాయబడిన ప్రకారము అనగా పరిశుద్దులముగాను, నిర్దోషులముగాను బ్రతకాలి,శ్రమలు అనుభవించాలి.ఈ విధముగా క్రీస్తు తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ,తండ్రి సిద్దపరచిన పనిని ఉన్నదున్నట్లు సంపూర్తి చేశాడు. ఈ మార్గములో క్రీస్తు తనకు తానుగా వెళ్ళాడు, ఆ పని చేశాడు. అంతే కానీ దేవుడే నేట్టలేదు.

12) మరొక వ్యక్తి అయిన యుధా ఇస్కరియోతు మాత్రము దీనికి పూర్తిగా విరుద్ధముగా చేశాడు. తనకు తను తప్పిపోయాడు. అపోకార్య1:25- తన చోటికి పోవుటకు యుధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఇందులో దేవుని ప్రమేయము ఏమి లేదు. అందరు మారు మనస్సు కలిగి, క్రిస్తులా బ్రతికి, తండ్రి దగ్గరకు చేరడమనేది దేవుని చిత్తము.( గలతీ 5:1,1 తిమోతి 2:4, 11 పేతురు 3:9).

13) చాల మందికి కలిగే ప్రశ్నను చూస్తే నేను చెడ్డవాడిగా మారి నరకానికి వెళ్లిపోతాడని తెలిసి దేవుడు నన్నెందుకు పుట్టించాడు?? దేవునికి నా భవిష్యత్తు తెలుసు గదా, మంచిగా మార్చుకోవచ్చు గదా అని అంటారు. దేవునికి భవిష్యత్తు తెలుసు అన్న మాట correct. కానీ దేవుడు నీకై సిద్దపరచిన పనులు నెరవేర్చాలని, దేవుడు ఉన్న లోకానికి నీవు చేరుకోవాలన్నదే అయన(దేవుని) ఆశ. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఎన్నడు ఆశించలేదు, ఆశించ డు కూడా.

14) దేవుడు జీవితాన్ని ఇచ్చాడు,స్వతంత్రత ఇచ్చాడు. సాతాను ద్వారా సమస్యలు వస్తాయని ,వాటిని ఎలా ఎదుర్కోవాలో bibleలో చెప్పాడు. ఎలా నేర్పుగా నడవాలో భోదించాడు.నడవకపోతే నరక శిక్ష ఉందని హెచ్చరించాడు. ఎందరో భక్తులు ఎలా నడిచారో సాదృశ్యముగా వివరించాడు.దేవుడు చెప్పినట్లు నడవని వారు ఏమయ్యారో bible లో చూపించాడు. ఇప్పుడు చెప్పండి. ఇందులో దేవుని తప్పు ఏమి ఉంది? ఇన్ని చెప్పిన మనకై మనము తప్పిపోతే,లోకశల్లో చిక్కుకుని నరకానికి జారిపోతే దేవుని ప్రేమేయము ఏముంది?

15) ఆత్మహత్య చేసుకోమని దేవుడు రాత వ్రాయలేదు-కానీ ఆత్మల రక్షణ కొరకు శరీరాన్ని అర్పించాలని వ్రాసుకున్నాడు(1యోహాను 3:16),, మితి మీరిన వేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావాలని దేవుడు వ్రాయలేదు-కానీ సత్య వాక్యాన్ని బహువేగంగా వ్యాప్తి చెందించి పాతాళమనే ప్రమాదము నుంచి ఎందరినో తప్పించమని వ్రాసుకున్నాడు( కొలస్సి 1:6), సాతాను పెట్టె శోధనలలో చిక్కుకుని పరలోకాన్ని పోగొట్టుకోవాలి అని వ్రాసుకోలేదు-గానీ సాతనును, వాని క్రియలను జయించాలని వానికి పరలోకములో క్రీస్తుతో పటు సింహాసనము ఇస్తానని వ్రాసుకున్నాడు(ప్రకటన 3:20)