Friday, April 10, 2015

శోధనపై బైబిల్ భోధన


ఈ రోజు ప్రపంచములోని మానవులంతా రెండు మహా అదృశ్య శక్తుల మధ్య జీవిస్తున్నారు. ఇందులో ఒక శక్తీ పేరు దేవుడైతే మరొక శక్తీ పేరు సాతాను. అనగా ఒక శక్తీ మంచిదైతే మరొక శక్తీ దుష్ట శక్తీ. కనిపించని ఈ రెండు అదృశ్య శక్తులైన దేవుడు ,సాతానుల మధ్య మనుష్యుడు బ్రతుకుతున్నాడని మొదట తెలుసుకోవాలిమరియుఈ రెండు శక్తులకు కావలసిన వాడే మనుష్యుడు కూడా. అయితే పైన చెప్పబడిన రెండు అదృశ్య శక్తులలో మనం ఎవరికీ చెందిన వారమో, ఎవరు మన తండ్రో, ఎవరు మనల్ని నడిపిస్తున్నారో,ఎవరి పిల్లలమో అను విషయములు తప్పక పరిశిలించుకుని తెలుసుకోవాలి.

కనిపించని మహా అదృశ్య శక్తీయైన దేవుడే ఈ సృష్టిలోనున్న మానవులైన ప్రతి వారిని కన్న పరలోకపు తండ్రి అని మనకు తెలుసు.ఎఫేసి 4:5-అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. మనమందరికి తండ్రి ఆ పరలోకపుదేవుడైతే మనం అయన పిల్లలమే అవ్వుతాము. నా పిల్లలు నాకే కావాలని, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలని, నా పిల్లలు నా ఇష్టానుసారముగా ఉండాలని, నా పిల్లలు నాకే చెందిన వారిగా ఉండాలని మనల్ని కన్న ఆ పరలోకపు తండ్రియైన దేవుడు తలంచుట ధర్మమే అవ్వుతుంది. యోహాను 8:44-మీరు మీ తండ్రియగు ఆపవాది( సాతాను) సంభందులు. పౌలు గారు ఎఫేసి 4:5 లో మన తండ్రి దేవుడనిఅని చెబితే యోహాను 8:44 లో తండ్రి సాతాను కూడ అనియేసుక్రీస్తు చెప్పాడు. అయితే సాతాను అన్యాయముగా తండ్రిగా దూరి మీరు నాకు కావాలి అని అనుకోవడము ఆధర్మమే అవ్వుతుంది. అనగా దేవుడు మనల్ని నిజముగా కన్న పరలోకపు తండ్రియైతే దుష్టుడైన సాతానుమధ్యలో వచ్చి మనకు తండ్రిగా మారిపోయిన దుర్మార్గుడు.

ఈ రెండు అదృశ్య మహా శక్తుల లక్షణాల విషయములో, మనస్తత్వం విషయములో చాలా తేడా ఉన్నదీ. మొదటిగా తండ్రియైన దేవుని గూర్చి చూద్దాము. దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తయైనపరలోకపు తండ్రి. పరిశుద్దత విషయములో దేవుడు గొప్పవాడు. ఈ పరిపూర్ణత గల దేవుడు తన పిల్లలమైన మన పట్ల ఏ కోరిక కలిగియున్నాడో చూస్తే లేవియకాండము 11:44- నేనుమీ దేవుడైన యెహోవాను ;నేను పరిశుద్దుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలేను. తన పోలికను తన పిల్లలమైనమనపట్ల ఉండాలనుకున్నాడు. అంటే దేవుడు మనల్ని పాపము లేని పరిశుద్దులుగా చూడాలనుకుంటున్నాడు. ఎఫేసి 1:4,6-మనము తన యెదుట పరిశుద్దులమును,నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన (తండ్రి) క్రిస్తులో మనలను ఏర్పరుచుకోనేను. అనగా ఈ సృష్టికి పునాది వేయబడకముందే ఏ పాపము లేకుండా,ఏ లోపాలు,తప్పులు లేని వారిగా నా పిల్లలు ఉండాలనే కోరిక దేవుడు మన పట్ల కలిగియున్నాడు.

తన పిల్లలను తమకు తాముగా ఒక విషయముపై ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము,ఏది అన్యాయము, ఏది సత్యము ,ఏది అసత్యము అని ఆలోచింపజేయడానికి దేవుడు పెట్టిన విధానమే “ పరిక్ష”. మన పిల్లలకు బడిలో ప్రతి సంవత్సరముఅనేకమైన పరిక్షలుపెడుతూ ఉంటారు. ఏ రోజైన పిల్లలు కలిగిన తల్లితండ్రులు బడికి వెళ్లి నా వాడికి ఎన్ని పరిక్షలు ఎందుకు పెడుతున్నారని అడుగుతారా? లేదు. పరిక్షలు పెట్టకపోతే అడుగుతారు కానీ పరిక్షలు పెడితే ఎవ్వరూ అడగరు. పరిక్ష ఉంటుందని తెలిసిన పరీక్షలో నెగ్గాలి అనే మనస్సు ఉండాలే తప్ప పరిక్ష పెట్టుటఎందుకు అని దేవునిని ప్రశ్నించుట సరి కాదు. పరిక్ష అన్నది మన మంచికే జరుగుతుందనే విషయము మనము తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనిషికి పరిక్షలు పెట్టాడు.

దేవుడు మొదటి పరీక్షను ఆదాము-హవ్వలకు పెట్టినప్పుడు చివరికి తినవోద్దన్న పండు తినీ దేవుడు పెట్టిన పరీక్షలో విఫలము అయ్యారు. ఏందుకు వీరు విఫలము అయ్యారని అలోచించలే తప్ప దేవుడు పరీక్ష ఎందుకు పెట్టాలి అని ఆలోచించుట తప్పు. ఆదాము-హవ్వలకు పరిక్ష పెట్టిన దేవుడే మరలా అబ్రహమునకు కూడా పెట్టాడు. అయితే దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గి ఈ రోజు విశ్వాసులకు తండ్రి అయ్యి చరిత్రలోనే గొప్పవాడు అయ్యాడు.(ఆదికాండము 22:1 నుండి 19).అనగా దేవుడు ఆదాము-హవ్వలకు, అబ్రహమునకుపరీక్ష పెట్టినప్పుడు అందులో అబ్రహాము నేగ్గినట్టుగా, అదాము-హవ్వలు తప్పినట్టుగా అర్థమయ్యింది. అంటే దేవుడు మనిషిని పరిక్ష చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నెగ్గిన వ్యక్తి మరియు ఓడినవ్యక్తులు కనపడుతున్నారు. అనగా దేవుడు పరిక్షించువాడని, పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుని యొక్క తత్వం ఏంటో చూస్తే - (a) ఆదికాండ 6:5-నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఉహా అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి... అంటేనరులహృదయ తలంపులను పరిశిలించేవాడుగా ఉన్నాడు. (b)ఆదికాండ 8:21-నరుల హృదయాలోచన వారిబాల్యము నుండి చెడ్డది.. అంటే హృదయ ఆలోచనలు పరీక్షించే వాడు. (c)1సముయేలు 16:7-యెహోవా హృదయమును లక్ష్య పెట్టును... (d) యోబు 34:21-అయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి యున్నది. అయన వారి “నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు”.కీర్తనలు 7:9- “హృదయములను,అంతరింద్రియములను పరిశిలించు”నీతి గల దేవా.... (e) సామెతలు 17:3-హృదయ పరిశోధకుడు యెహోవాయే. (f) సామెతలు 21:2-యెహోవాయే హృదయమును పరిశీలన చేయువాడు. (g) యిర్మియా17:10- యెహోవా అను నేను హృదయమును పరిశోదించువాడను.. (h) రోమా 8:27-హృదయములను పరిశోదించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. (i) 1యోహాను 3:20-దేవుడు మన హృదయము కంటే అధికుడై ,సమస్తమును ఎరిగియున్నాడు. ఇలా పై వచనములోని సారాన్ని ఆలోచిస్తే దేవుడు పరీక్షించువాడని , పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుడు పెట్టు పరిక్ష మనిషికి మంచి చేస్తుందే కానీ చెడు చెయ్యదు. తన యెదుట మనిషిని గొప్పగా నిలబెట్టటానికి దేవుడే ఆ పరీక్షలు పెడుతున్నాడు. అస్సలు ఈ పరిక్షలు ఎందుకు పెడుతున్నాడో చూస్తే నిర్గమ 20:20-మీరు పాపము చేయకుండునట్లు, అయన భయము మీకు కలుగుటకు ... పాపము చేయకుండ ఉండడానికి, దేవుని యెడల భయము కలుగుటకు ఈ పరిక్షలు.. అనగా 1) పరిక్ష ఉంటేనే భయము ఉంటుంది. 2)భయము కలిగినప్పుడు పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్తపడుతాము. పై వివరణలో దేవుని యొక్క తత్వం పరిశోధకుడనీ అర్థమయ్యింది.

ఇప్పుడుసాతాను యొక్క తత్వము - చూస్తే వీడు శోధకుడు. పరిశోధకుడు & శోధకుడు అను రెండు పదాలకు చాలా తేడ ఉన్నదీ. పరిశోధకుడు-మనం పాపము చేయకుండ ఆపుతాడు& శోధకుడు- మనం పాపము చేయుటకు రెచ్చగొట్టి ప్రయత్నిస్తాడు. అనగా తప్పులు చేయుటకు ఆపేవాడు పరిశోదకుడైన దేవుడైతే తప్పు చేసేలా ప్రయత్నించేవాడు శోదకుడైన సాతాను. దేవుడు పరిశోధించిన అనేకమందిలో మనం గొప్పవారిగా చెప్పువారిలో యోబు ఒకరు. యోబు యధార్ధవంతుడు, న్యాయవంతుడు,దేవుని యెడల భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు అను విషయములు మనకు తెలుసు. యోబు 2:3 నుండి చూస్తే తన కుమారుడైన యోబు ఎంత గొప్పవాడో సాతనుకు నిరూపించడానికి శోదించుటకు సాతనుకు ఆవకాశంఇచ్చాడు. భక్తుడైన యోబును దేవుడు సాతనుకు అప్పగించాడు. 

 యోబు విషయములో దేవుని పరిశోదన & సాతాను శోదన జరిగాయి. యోబుచివరికి దేవుడు పెట్టిన పరీక్షలో గెలవడమే కాక సాతాను పెట్టిన శోధనను జయించాడు. అనగా భక్తుడైన యోబుకు పరిశోదన & శోదనఏదురైనది. “”దేవుడుతన భక్తులను చూచి ఏంత ఆనందపడుతాడో ఆ భక్తులను చూసి సాతాను తట్టుకోలేక వారిని చెడగొట్టాలని,లోకములో కలిపి వేయాలని చివరికి దేవునికి దూరం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునితో దగ్గర సంభంధం కలిగియున్న వారిపై సాతాను గురి ఎప్పటికి ఉంటుంది. ఒక్కసారి నా చేతికి అప్పగిస్తే మీ బిడ్డలు ఎంత బలహినులో చూపిస్తానని దేవునికే సవాలు విసురుతాడు. లూకా 22:31- ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోదుమవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను.

 సాతాను పెట్టు శోదనలు జయించాడు కనుక చరిత్రలో యోబు గొప్పవాడయ్యాడు. యాకోబు 1:12 నుంచి-శోదన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్ధానము చేసిన జీవకిరిటము పొందును.””” శోధనకు నిలిచిన వాడు,శోధనను సహించు వాడు, శోధనను జయించువాడే జీవకిరిటానికి పాత్రుడు”””. ప్రకటన 3:21-నేను జయించి నా తండ్రితో కూడ అయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. అనగా తండ్రి సింహాసనముపై కూర్చుండే అర్హత శోధనను జయించిన వాడిదే.. జీవకిరిటం పొందాలని మీకుగురిఉంటే సాతాను పెట్టు శోధనకు నిలిచి, సహించి& జయించాల్సిందే. పిరికివారు అంటే దేవునికి అసహ్యము. సాతాను పెట్టు శోధనకు భయపడి, సహించలేక చివరికి జయించలేక శోదనలు కల్పించవద్దు అనికొందరు ప్రార్ధనలు చేసే వారు దేవునికి ఇష్టులు కాలేరు.

అనేకమంది బాప్తీస్మం తీసుకున్నాక శోదనలు ఎక్కువ అయ్యాయి అని, రోజు వాక్యము చదువుతూ,ప్రార్ధన చేసుకుంటూ ,సంఘానికి వెళ్తున్న నాకు శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని ,దేవునిలోకి రాక ముందు ఆనందముగా ఉన్నాను కానీ దేవునిలోకి వచ్చాక శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని కొందరు అంటూ ఉంటారు. శోదనలన్నవి ప్రతి మనిషికి వస్తాయి. అప్పుడు వాటియందు నిలిచి, సహించి& జయించి సాతనును చితకకొట్టి రావాలే కానీ పిరికివాడిగా శోదనలు వద్దు ప్రభువా అని ప్రార్ధన చేయకూడదు. దేవుడునా తండ్రి అని చెప్పుకుంటూనప్పుడు , అయన బలవంతుడని చెప్పుకుంటూనప్పుడు అయన పిల్లలమైన మనము ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఉండాలే కానీ సాతాను పెట్టు శోధనలకు భయపడి పిరికివాడిగా చరిత్రలో నిలిచిపోతావా??

సాతాను మనల్ని చూసి పారిపోవాలే కానీ వాడు పెట్టు శోధనలకు దేవుని నుండి మనం పారిపోకూడదు. 1 కోరంది 10:12,13- తాను నిలుచుచున్నానని తలంచుకోనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోనవలెను. సాధారణముగామనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభావింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడు.సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.పై వచనములోని భావాన్ని చూస్తే దేవుడు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడని, సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయునను విషయము అర్థమయ్యింది.

సాతాను పెట్టు శోధనను జయించే మార్గమును చూస్తే - ఎఫేసి 6:11- మీరు అపవాది తంత్రములను ఏదిరించి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు” సర్వాంగ కవచమును ధరించుకోనుడి”. అనగా సాతాను యొక్క తంత్రములైన శోదనలు జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి అని అంటున్నాడు. అలానే మనకు శత్రువు శరిరులు కాదు కానీ సాతనే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మనకు శత్రువు అనే వాడు ఉన్నాడు అంటే వాడు కేవలం సాతనే కానీ సాటి మనిషి కాదు.ఇప్పుడు సర్వాంగ కవచుములోని ఒక్కొక భాగాన్ని చూద్దాము.
(a) ఎఫేసి 6:14-“నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి”. సత్యం అనగా వాక్యం(యోహాను 17:17). సత్యమను వాక్యమును ధరించాలి. నీ దగ్గర నుండి సత్యం దూరము అవ్వకుండా మరియు సత్యానికి నువ్వు దూరం అవ్వకుండా జాగ్రత్తపడాలి.సాతాను కల్పించు అబద్ద భోదనల యెందు కాక సత్యమైన వాక్యమునకు కట్టుబడి యుండాలి. అనగా సత్యములో నిలిచి ఉండాలి. (b) ఎఫేసి 6:14-“నీతి అను మైమరువు తోడుగుకోవాలి”. నిరిక్షిణకు ఆధారమే లేనప్పుడు దేవునిని నమ్మడమే దేవుని దృష్టిలో నీతి. హెబ్రీ 11:7 లో నోవాహు విశ్వాసము బట్టి నీతికి వారసుడాయేను. ఆదికాండ 15:6 లో అబ్రహాము యెహోవాను నమ్మెను; అది అతనికి నీతిగా ఎంచెను. నమ్ముటకు అవకాశమే లేని దేవునిని, పరలోకమును,నరకమును, యేసుక్రీస్తును, పరిశుద్దాత్మను నమ్ముటయే నీతి& నమ్మువాడే నీతిమంతుడు. (c) ఎఫేసి 6:15-“పాదములకు సమాధాన సువార్త వలనైనసిద్ద మనస్సను జోడు తోడుగుకోవాలి”.సువార్త వ్యాప్తిలో పాలి భాగస్థుడు అవ్వుటకు మనం సిద్దముగా ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుని ,పాటించి, చెప్పాలి, చెప్పించాలి& చెప్పే వాళ్ళకు సహకరించాలి. (d) ఎఫేసి 6:16-“విశ్వాసము అను డాలు పట్టుకోనుడి”. హెబ్రీ 11:1 లో విశ్వాసం యొక్క నిర్వచనము చెప్పబడింది. అదృశ్యమైన ఉన్నాయి అని నమ్ముటయే విశ్వాసము. అద్రుశ్యుడైన దేవుడు ఉన్నాడని,ఆ దేవుడు మన పాపాల నిమిత్తము యేసును ఈ లోకానికి పంపించాడని, ఈ యేసు చనిపోయి తిరిగి లేచాడని,పునరుర్ధనుడైన యేసు రెండవ రాకడలో వచ్చి విశ్వాసుల జాబితలోనున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళుతాడని విస్వసించాలి. మనం విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. (e) ఎఫేసి 6:17-“రక్షణ అను శిరస్త్రాణమును ధరించాలి”. రక్షణ పొందాలి అంటే i) యేసుప్రభువు అని ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసించాలి. ii) యేసుప్రభువు నామమున తండ్రికి పాపపు ఒప్పుకోలు ప్రార్ధనను చేయాలి. iii) నమ్మి బాప్తీస్మం పొందితే రక్షింపబడుతారు. బాప్తీస్మం తీసుకుని నమ్మకముగా జీవిస్తే రక్షణ అను శిరస్త్రాణమును కలిగియుంటాము. (f) ఎఫేసి6:17- “వాక్యమను ఖడ్గమునుధరించుకోవాలి”.
ఇలా సర్వ అంగమునకు పై చెప్పబడిన కవచమును ధరించి సాతాను పెట్టు శోధలతో యుద్ధము చేస్తే విజయము మనదే అవ్వుతుంది... ఇందులో ఈ ఒక్కటి లేకుంటే సాతను పెట్టు యుద్దములో ఓడిపోతాము.

Friday, February 13, 2015

బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్న చారిత్రక ఆధారాలు

బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్న చారిత్రక ఆధారాలు ఖుమ్రాన్ గుహలలో లభ్యమైన వ్రాతప్రతులు ఒక గ్రంధాన్ని గాని పుస్తకాన్ని గాని సత్యమని చెప్పాలంటే.. నమ్మాలంటే కొన్ని రంగాల్లో ఆ గ్రంధము ఋజువు చేయబడాలి. శాస్త్రీయ ఆధారాలు.. భౌగోళిక ఆధారాలు, పురావస్తు నిదర్శనాలు, చారిత్రక ఆధారాలు, విశ్వవ్యాప్త అంగీకారం ఆ గ్రంధాన్ని ధృడపరచుతాయి. ప్రపంచంలో ఏ గ్రంధానికి లేనటువంటి తిరుగులేని ఆధారాలు, నిదర్శనాలు పరిశుద్ధ గ్రంధానికి ఉన్నాయి. దేవుని అధికార ముద్ర, ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ బైబిల్ ప్రత్యేకతకు తార్కాణాలు. అనునిత్యమూ ఎన్నో ఎన్నో పరిశోధనలు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో విశిష్ట నిధులు బయటపడుతూనే ఉన్నాయి.

దాదాపు చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలువైన నిధులు కొన్ని సం||రాల క్రితం బయటపడ్డాయి. అవే ఖుమ్రాన్ గుహలలో బయటపడ్డ బైబిల్ యొక్క వ్రాతప్రతులు ఖుమ్రాన్ గుహలలో లభించిన తిరుగులేని ఆధారాలు బైబిల్ యొక్క చారిత్రక ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నాయి. వాటినే మృతసముద్రపు వ్రాతప్రతులు (Dead Sea Scrolls) అని కూడా అంటారు. వాటి వివరాల్లోకి వెళితే... ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న మృత సముద్రానికి ఒక మైలు దూరంలో ఈ ఖుమ్రాన్ గుహలు కనబడతాయి. ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశం. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ఖుమ్రాన్ గుహలలోనే బైబిల్ వ్రాతప్రతులు దొరికాయి. క్రీ|| పూ||134 సం||లో జాన్ హిర్కనస్ పాలనలో ఈ ఖుమ్రాన్ గుహలలో కొంతమంది గ్రీకులు ఉండేవారు. ఆ తరువాత క్రీ.శ.68లో రోమన్లు వారిని అక్కడ నుండి పంపించి వేశారు.

ఖుమ్రాన్ గుహల్లో జరిగిన అనేక పరిశోధనల్లో బైబిల్కి సంబంధించిన అద్భుత వ్రాతప్రతులు బయటపడ్డాయి. 1947 సం|| నుండి 1956 సం|| వరకు జరిగిన పరిశోధనల్లో 900కు పైగా లిఖిత పత్రాలు లభ్యమయ్యాయి. దాదాపు ఖుమ్రాన్ ప్రాంతంలో ఉన్న 11 గుహల్లో అవి లభ్యం కావడం గమనార్హం. బైబిల్ గొప్పతనం అర్ధం చేసుకోవడానికి ఆ గుహల ఫోటోగ్రాఫ్స్ చూడండి. అది 1947 ఫిబ్రవరి 16... ఖుమ్రాన్ గుహల ప్రాంతంలో గొర్రెల కాపరులుగా ఉన్న మహ్మద్ ఎదీబ్ మరియు అతని తమ్ముడు మొదటిసారిగా మట్టి కుండలను ఈ ప్రాంతాల్లో చూశారు. ఎంతో ఆశతో ఆసక్తితో ఆ కుండల యొద్దకు వెళ్ళి వాటిలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకున్నారు. కాని వారికి వాటిలో కొన్ని చర్మపు కాగితాలు, పైపరస్ బెరడులపై వ్రాసిన వ్రాతప్రతులు కనబడ్డాయి. వారి దృష్టి బహుశా భౌతిక సంబంధమైన వస్తువులపై ఉంది గాని ఆ గ్రంధముల యొక్క విలువ బహుశా అప్పటికి వారికి తెలీదు. ఆ మట్టి కుండల్లో లభ్యమైన ఆ పత్రాలను తమ గృహాలకు తీసుకొని వెళ్ళి అందరికి చూపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహా ఏమిటంటే ఎక్కడో చోట, ఎవరికోకరికి వీటిని అమ్మేస్తే కొంతైనా డబ్బులు రాబట్టవచ్చునని కొన్ని రోజులు వాటిని వారి దగ్గర ఉంచుకొని చివరకు వాటిని 29 డాలర్లకు అమ్మేస్తారు. ఆ విలువైన పత్రాలు అనేకుల చేతులు మారి సిరియా దేశపు బిషప్గా ఉన్న అతానిసియస్ సామ్యూల్ చేతిలో పడ్డాయి. ఆయనను మార్ సామ్యూల్ అని కూడా పిలుస్తారు. డెడ్సీ స్క్రాల్స్ గూర్చి అధ్యయనాల్లో  ప్రముఖంగా కనిపించేది ఇతని పేరు. కారణం ఆ పత్రాలు. గ్రంధపు చుట్ట విలువ మొదటిగా తెలుసుకున్నది ఇతనే. మార్ సామ్యూల్ వీటిని జాగ్రత్తగా  పరిశీలించడం ప్రారంభించాడు. హెబ్రీ భాషలో వ్రాయబడిన ఆ లిఖిత పత్రాలను శ్రద్ధగా అధ్యయనం చేసి వాటి విశిష్టతను  లుసుకొన్నాడు.

ప్రపంచమంతా నివ్వెరపోయే ఓ అద్భుత వ్యాఖ్యను చేశాడు. 'ప్రపంచంలోనే అత్యంత విలువైన పత్రాలు నా దగ్గరున్నాయి' అని మార్ సామ్యూల్ బహిరంగ వ్యాఖ్య చేశాడు. మార్ సామ్యూల్ పరిశోధనల్లో తేలిన ఫలితార్ధమిదే. ఖుమ్రాన్ గుహల్లో దొరికిన కుండల్లో లభ్యమైన వ్రాతప్రతులు సామాన్యమైనవి కావు. అవి విలువైన 'బైబిల్' గ్రంధము యొక్క వాస్తవ వ్రాతప్రతులు. దేవాది దేవుని ప్రేరేపణతో, ప్రత్యక్షతలతో వ్రాయబడిన గ్రంధాలు. క్రీ.పూ.ఎన్నో సంవత్సరాలకు ముందే పరమతండ్రి, స్వయంభవుడు అయిన దేవుడు ప్రజానీకానికి ఇచ్చిన ఆజ్ఞలు, సూచనలు, వాగ్దానాలు, ప్రవక్తలు దైవాత్మ ప్రేరేపణతో వ్రాసిన మాటలు. అప్పటికి మార్ సామ్యూల్ యొద్ద ఉన్న గ్రంధాలు ఈ విధంగా గుర్తించబడ్డాయి. Isaiah Scroll (యెషయా గ్రంధము). The Community Rule (కమ్యూనిటీ రూల్). Habakkuk Pesher (హబక్కుకూ గ్రంధ వ్యాఖ్యానము). Genesis Apocryphon ఈ లోపులో ఇశ్రాయేలు దేవానికి స్వాతంత్య్రం రావడం, చెదిరిపోయిన యూదులందరూ ఆయా దేశాల నుండి ప్రోగుచేయబడి ఒకచోట ఒక దేశంగా సమకూడడం ఆ వెనువెంటనే ప్రక్కదేశాలు ఇజ్రాయేల్పై యుద్ధానికి రావడం చరిత్రలో గమనించదగ్గ విషయాలు. ఆ యుద్ధ భీభత్సంలో ఈ దివ్యజ్ఞాన గ్రంధం యొక్క మూల లిఖిత పత్రాలకు ఎటువంటి హాని కలుగకూడదనే ఉద్దేశ్యంతో బిషప్ మార్ సామ్యూల్ వీటన్నింటిని లెబనాన్ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఎట్టకేలకు అత్యంత విలువైన, ప్రతిష్టాత్మకమైనఈ గ్రంధాల గొప్పతనాన్ని గుర్తించిన ఇజ్రాయేల్ దేశంలో హిబ్రూ యూనివర్శిటీలో ప్రొఫెసర్ బెంజిమన్ మాజర్ మరియు ప్రొఫెసర్ యదీన్ వాటిని యెరూషలేమునకు తీసుకొనివచ్చారు. అందుకుగాను వారు ఖర్చుచేసిన మూల్యం ఎంతో తెలుసా? అక్షరాల రెండు లక్షల యాభైవేల డాలర్లు. 1947 నుండి 1956 వరకు దాదాపు 900 డాక్యుమెంట్లు ఖుమ్రాన్ గుహలలో లభించాయి. వాటిలో ఎన్నో ఎన్నో శ్రేష్టమైన అంశాలు దాగి ఉన్నాయి. కీర్తనలు గ్రంధం, సామెతల గ్రంధం, ప్రవక్తల గ్రంధాలు, చారిత్రక గ్రంధాలు ఇలా అనేక గ్రంధాలు ఈ గుహల్లోనే లభ్యమయ్యాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది (కీర్త 19:7) మరియు సత్యమైనవి (కీర్త 19:9) అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తున్న రీతిగా తిరుగులేని ఆధారాలు నిదర్శనాలు బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని మనం గమనిస్తే దొరికిన ఆ గ్రంధాలన్నింటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు.

Tuesday, December 16, 2014

క్రిస్మస్

2000సంల క్రితం యేసుక్రీస్తు ఈలోకములో పుట్టాడని, 2000 సంవత్సరాల ముందు ఆయనకు ఏ చరిత్ర లేదని అనుకుంటుంది ఈ అమాయక ప్రపంచములోని అమాయక మనుషులు. వాక్యము తెలియని భోదకుల సైతం యేసు 2000సంల క్రితంఈలోకములో పుట్టాడని ఘంటాపదంగా భోదిస్తున్నారు. ఇలా చెప్పుట వలన ప్రపంచం అయన పుట్టింది 2000సంల క్రితమే కదా మరి అయన కంటే బుద్ధ, అలక్షాండెర్, ఎంతో మంది రాజులు వచ్చారు కదా మరి వాళ్ళందరి తర్వాత వచ్చిన అతను యేసుక్రీస్తు అని, వాళ్ళందరి కంటే చిన్నవాడు యేసుక్రీస్తు అని చెబుతున్నారు.

అనేకులు భావిస్తున్నట్లుగా యేసు కన్య మరియ గర్బాన్న2000సంల క్రితం పుట్టినా, ఈ సృష్టి పుట్టక మునుపే పరలోకములో ఉన్నాడు. నేటి క్రైస్తవులు సైతము యేసు కన్య మరియ గర్భాన పుట్టిన ఘటననే మాటిమాటికి చెబుతూ, పండగలుగా(క్రిస్మస్) ఆచరిస్తున్నారే గానీ, యేసు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నవాడని ప్రపంచం గుర్తించేలా ఎలుగెత్తి చాటటం లేదు. పరలోకమందు ప్రారంభమైన మహనీయునిగా యేసుని చూడవలసిన ప్రపంచము, మట్టిలోకములో పుట్టిన మట్టి మనిషి గానే చూస్తున్నారంటే తప్పు ఈ భోదకులదే కాదంటారా?

వాక్యము తెలిసిన క్రైస్తవులైన మనము యేసుక్రీస్తును పరిచయం చేయు విధానము తెలియకపోవుట వలన ఇలా తప్పుడు అభిప్రాయము కలిగి, తప్పుడుగా ఆలోచిస్తూ, తప్పుడుగా భోదిస్తున్నారు. వాస్తవముగా యేసుక్రీస్తును పరిచయం చేయవలసిన తీరు ఇది కాదనే చెప్పాలి.

అస్సలు యేసుక్రీస్తు 2000సంల క్రితం ఈ లోకమునకు వచ్చాడా లేక పుట్టాడాన్న ప్రాముఖ్యమైన మూల విషయము తెలుసుకోవాలి. హెబ్రీ 10:5 కాబట్టి అయన ఈ లోక మందు “ప్రవేశించునప్పుడు” ఈలాగు చెప్పుచున్నాడు. వచ్చాడు అంటే అంతకముందుగానే ఉన్నవాడని అర్థమవుతుంది. ఉదా: నేనునెల్లూరు నుండి హైదరాబాద్ కూ వచ్చాననుకోండి. అనగా అంతక ముందు నేను నెల్లూరులో ఉన్నానని మరియు ఉన్న నేను హైదరాబాద్ కూ వచ్చానని అర్థమవుతుంది. అలానే యేసుక్రీస్తు 2000సంల క్రితంఈ భూమి మీదకు వచ్చాండంటేఅంతకుముందు అయన ఎక్కడో ఉన్నాడని అర్థమవుతుంది. అంటే అయన చరిత్ర 2000సంల క్రితముది కాదని,అంతకంటే ముందు యేసుక్రీస్తుకు చరిత్ర ఉందని ప్రపంచమునకు, మనము తెలియజేయాలి.

2000సంల క్రితం ఈ లోకానికి వచ్చాడు అంటే ఎప్పుడు పుట్టాడు? పుట్టుక ఎప్పుడు జరిగింది? తన పుట్టుక గురించి తను చెప్పిన సంగతి చూస్తే సామెతలు 8:22-26  పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. పై వచనాలలో సృష్టి పుట్టకముందే పుట్టినట్టుగా అర్థమవుతుంది. అనగా అసలైన పుట్టుక జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తు పుట్టాడు. కీర్తనలు2:7 యెహోవా నాకిలాగుసెలవిచ్చెను –నీవునా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఇలా తండ్రి ఎప్పుడైతే యేసుతో అన్నాడో ఆ రోజున పుట్టిన వాడు. యేసుక్రీస్తు ఎప్పటివాడు?

యోహాను 1:1 ఆది యందు వాక్యము ఉండును. వాక్యము దేవుని యెద్ద ఉండెను.వాక్యము దేవుడై ఉండెను. యోహాను1:14 ఈ వాక్యము శారిరధారియై యేసుగా వచ్చెను. ప్రకటన 19:13 దేవుని వాక్యము అను నామము ఆయనకు(యేసు) పెట్టబడియున్నది. ఇప్పుడు వాక్యము అనగా యేసు అను మాటను యెహోవా1:1లో పెట్టి చదవండి. అనగా అది నుండి దేవుని యెద్ద దేవుడిగా ఉన్నాడు యేసు. అయన సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. యెషయ 9:6 మనకు శిశువు పుట్టెను. ఇక్కడే పుట్టెను అను మాట ఉంది కానీ పుట్టబోవుతున్నాడు అని లేదు.యెషయ చెప్పక ముందే యేసు పరలోకములో ఉన్నాడు. యోహాను1:3 కలిగి ఉన్నదేదియు అయన(యేసు) లేకుండా కలుగలేదు. అంటే యేసు సృష్ట పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నాడు.

అయన జగత్తు పునాది వేయబడక ముందే పుట్టాడని యేసును గూర్చి ప్రపంచమునకు పరిచయం చేయాలి. సైన్సు ప్రకారముగా ఈ ప్రకృతి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలని అంటున్నారు. ప్రకృతి పుట్టక మునుపేయేసుక్రీస్తు పుడితే నేటికి ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే యేసు ఎంతటి కాలమునకు క్రిందటి వాడు? ఇంత గొప్ప చరిత్ర కలిగిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడో పుట్టినవాడు ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన 19:16 రాజులకు రాజును,ప్రభువుల కు ప్రభువును అను నామము అయన వస్త్రము మీదను,తోడ మీదను వ్రాయబడింది. అనగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినవాడు రాజులకు రాజు,ప్రభువులకు ప్రభువు అని పరిచయం చేయాలి. ఏ కారణం లేకుండా యేసుక్రీస్తుఈ లోకానికి వస్తాడా? ఉదా:: అప్పుడప్పుడు ముఖ్య మంత్రి లేక ప్రధాన మంత్రి మన ప్రాంతమునకు వస్తుంటారు. ఒక్క పని కోసమే కాక అనేక పనులను ముందుగా నిర్ణయించుకొని వస్తారు. అనగా శంకుస్థాపన-విగ్రహ ఆవిష్కరణ-రచ్చబండ పాల్గొనుట- సాయంత్రపు మహా సభలలో మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్య మంత్రి ఒక ప్రాంతం వెళ్ళాలంటే సమయము తీరిక లేకుండా చేసుకునివస్తాడో మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? ఏ కారణాలు లేకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటారా?లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఫిలిఫు 2:6  అయన (యేసుక్రీస్తు) దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గానీ “మనుష్యుల పోలికగా పుట్టి”,”దాసుని స్వరూపమును ధరించుకుని”,తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.మరియు అయన అకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా అనగా “సిలువ మరణము పొందునంతగా” విధేయత చూపినవాడై ,తన్ను తాను తగ్గించుకొనేను.

భూమి పుట్టక మునుపు అయన పుడితే ఒక వేళ అయన పుట్టుక క్రిస్మస్ అనుకుంటే డిసెంబర్ 25 ఎప్పుడు వచ్చింది? భూమి పుట్టిన తర్వాత డిసెంబర్ 25 ఏర్పడింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తేది డిసెంబర్ 25 నా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 

యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యముగా ఏడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము:

(a) మొదటి కారణము - తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయుట కొరకు, తండ్రి మనస్సును బయలు పరచడానికి యేసుక్రీస్తుఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ మంతా పరలోకపు తండ్రిని గుర్తించలేని పరిస్థితిగా ఏర్పడింది. యోహాను 1:18 ఎవడును, ఎప్పుడైనను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. అనగా పరలోకపు తండ్రి మనస్సును ప్రపంచానికి చూపించుట కొరకు, తండ్రి మనస్సులో ఉన్న ఉద్దేశాలను, భావాలను,ఇష్టాలను,చిత్తాన్ని ఈ లోకానికి చూపించుట కొరకు వచ్చాడు.

(b) రెండవ కారణము - దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని చూపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెషయ 9:6 అయన భుజము మీద రాజ్య భారముండెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజ్య స్థాపన చేయుటకు వచ్చాడు.అయన రాక ముందు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలి. నాలుగు సామ్రజ్యాలు భయంకరముగా పరిపాలిస్తున్న కాలము ఆది. 1. నెబుకద్నేజరు చేత పరిపాలింపబడిన బబులోను సామ్రాజ్యం 2. మాదియ పారసికుల సామ్రాజ్యం 3. గ్రీక్ సామ్రాజ్యం 4. రోమా సామ్రాజ్యం. దానియేలు 2:44 ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును.దానికెన్నటికి నాశనము కలుగదు.ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్ములము చేయును గానీ ఆది యుగములు వరకు నిలుచును. పై వచనములో అయన మొదటి రాకడలో రాజ్యం వస్తుందని,రాజ్య స్థాపన జరుగుతుందని అర్థమవుతుంది. లూకా1:33 అయన(యేసు క్రీస్తు) రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను.పైవచనములో గబ్రియేలు దేవ దూత మరియతో రాజ్యము గూర్చి తెలియపరచడమైనది. లూకా17:20 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు అయన-దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదీ. దేవుని రాజ్యమును స్థాపించుటకు, ఆ రాజ్యానికి ఆహ్వానించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యమును స్థాపించుటకే కాక మరొక రాజ్యమును చూపించుటకు వచ్చాడు. మత్తయి 12:26 సాతనును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరు పడును.అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?? అనగా సాతాను రాజ్యము అప్పటికే లోకములో ఉంది.

(c) మూడవ కారణము - పాపులను రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనేను. లూకా19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. పై వచనాలను పరిలిస్తే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చినట్టుగా అర్థమవుతుంది.

(d) నాల్గోవ కారణము - అన్యజనులైన మనకు రక్షణను కలుగజేసి దేవుని ఇంటివారిగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు.. యేసుక్రీస్తు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఒక్క ఇశ్రాయేలియులకు తప్ప నిజమైన దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు. అప్పటిలో ఎందరో ప్రవక్తలు అనేక ప్రవచనాలు అనగా త్వరలో మెస్సయ వస్తాడని, ఇంతవరకు ఉన్న అన్యజనులందరిని ఇశ్రాయేలియులతో సమానము చేస్తాడని అప్పుడు అన్యజనులకు కూడ దేవుడు తెలియబడతాడని ప్రవచించారు. యెషయ 2:2  ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు, యెషయ2-4 అయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును, యెషయ 42:1 అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును, యెషయ 42:7 అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. అనగా యేసుక్రీస్తు అన్యజనులను దేవుని ఇంటిలోనికి లాగుటకు వచ్చాడు. అన్యజనులను  శ్రాయేలియులతో సహా పౌరులుగా చేయుటకు వచ్చాడు. ఒక వేళ యేసుక్రీస్తు రాకుంటే మన పరిస్థితి ఏంటి? నిజమైన దేవునిని తెలియని వారముగా బ్రతికి ప్రాణము విడిచేవారము. అయన లేకుండా ఒక్కసారి మన జీవితాలను ఆలోచిస్తే భయం పుడుతుంది. యేసుక్రీస్తును బట్టి మనకు పరలోకం వస్తుందని ఆశతో ఉన్నాము.

(e) ఐదవ కారణము - ధర్మశాస్త్రము అను చెరలో ఉన్నవారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చేంత ముందు ఇశ్రాయేయులు ధర్మశాస్త్రము అనే చెరలో ఉన్నారు. గలతీ 3:23 చెరలో ఉంచబడినట్టు మనముధర్మశాస్త్ర మునకు లోనైనవారమైతిమి. లూకా  4:18 చెరలో ఉన్నవారిని విడిపించుటకు అయన నన్ను పంపెను. ఎఫేసి 2:14 మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన అజ్ఞాలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హెబ్రీ 10:9 ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

(f) ఆరవ కారణము - మనలాంటి శరీరంతో ఉన్నను ఏ మచ్చ లేకుండా జీవించవచ్చు అని చెప్పుటకు వచ్చాడు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మిలో ఎవడు స్థాపించును? మనలాంటి మట్టి శరీరంతో ఉన్నను పాపం లేకుండా జీవించాడు. 

(g) ఏడవ కారణము - అంత్యదినాలను ప్రారంభించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 1:1 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. 1పేతురు 1:20,21 కడవరి కాలమందు అయన ప్రత్యక్ష పరచబడెను. 1 యోహాను 2:18 ఇది కడవరి ఘడియ. 

పై చెప్పబడిన ముఖమైన ఏడు ప్రధాన కారణాలతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కనుకకేవలము క్రిస్మస్ దినమున మాత్రమే యేసును గూర్చిన మాటలే ప్రకటించక ప్రతి దినము ప్రకటించాలి. యేసు క్రీస్తు ఎవరో, ఈ లోకానికి రాక ముందు ఎక్కడ ఉన్నాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, యేసులో ప్రత్యేకత ఏంటో ఇలా అనేక అంశాలతో కూడిన సువార్తను కేవలము క్రిస్మస్ దినమునే కాక ప్రతి దినము ప్రకటించి కొందరినైన నరకము నుండి వారి ఆత్మను తప్పించి దేవుని వైపు మళ్ళిద్దాం. మార్క్ 16:15 మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షించబడును;నమ్మనివానికి శిక్ష విధింపబడును.

Tuesday, November 11, 2014

THE TRUE MEANING OF - "AMEN"

One day God took Abraham outside his tent & told him,“Look towards the heavens and see if you can count the stars there.That’s how many descendants you're going to have” (Genesis 15:5). At that time Abraham didn’t even have one child. There r millions of stars in the sky. And it says that Abraham believed the Lord (Genesis 15:6). The word ‘believe’ there in the original Hebrew is ‘AMAN’ from which we get the English word ‘AMEN’ which means ‘I believe that it will be so.’ So when God told Abraham that his seed would be like the stars of heaven, Abraham just said,“Amen=I believe it will be so” That’s it. And it was fulfilled. Today, the children of Abraham (physically & spiritually)number in millions.

Faith means saying “Amen” when God has said something to you. Faith is always based on the word of God. “Faith comes by hearing and hearing by the word of God” (Rom.10:17). You can’t have faith, if you don’t listen to God. Abraham heard God first. Then he said “Amen”. Nowadays, I find many believers saying that they have faith for things about which God has said nothing. They say: “I have faith that God will give me a Mercedez-Benz car. And I believe it’s going to be black in colour. ”That’s not faith. That is presumption. It is tempting God. Faith can be born only after hearing God speaking to us first. Only then can we say, “Amen=It shall be so.” If you remember this, you will be saved from presumption and from counterfeit faith.

Faith begins with God’s promise & not with our desires. Once God has spoken, we must keep on saying,“Amen” to it, all through our life, no matter how long God takes to fulfill His Word. But in Genesis 16; we read that Sarah was impatient. She suggested to Abraham to have children through Hagar, her maid (Gen.16:2). What did Abraham do then? unfortunately he said, “Amen”, to Sarah too. That caused a problem for Abraham’s descendants that have now lasted for 4000 years.

Never say "Amen" to man's word

Thursday, October 30, 2014

అంగ వైకల్యం గలవారిని దేవుడే పుట్టిస్తున్నాడా?

1) ప్రపంచ మనుషులలో అతి కొద్దిమంది అంగవైకల్యంతో మన ముందు ఉండటం చూస్తున్నాము. కాళ్ళు లేని వారుగా, చేతులు లేని వారుగా, చూపు లేని వారుగా, వినికిడి లేని వారుగా, మాట్లాడ లేని వారుగా, మతి స్థిమితం లేని వారుగా ఇలా అనేక రకాలుగా అనేక మంది మన కళ్ళకు కనబడినప్పుడు చూసి జాలి పడటం సహజం. వీరి విషయములో ఆరోగ్యంగా ఉన్నవారు అనగా ఏ లోపం లేని వారు అయ్యో అనడం, అయ్యో పాపం అనడం ఇలా వారి భాదను తమ మాటలతో వ్యక్తపరుస్తారు.

2) అంగవైకల్యంతో భాదపడుతున్నవారు ఆరోగ్యంగా ఉన్నవారిని చూచి దేవుడు నాకు ఎందుకు ఇలాంటి బ్రతుకును ఇచ్చాడు అని, వారినెందుకు అలా ఆరోగ్యముగా చేసి నన్ను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుట్టించాడు అని, నేను ఏమి పాపం చేసానని కుమిలిపోతు, కృంగిపోతు భాదపడుతుంటారు. ఇంకా కొంతమంది అస్సలు దేవుడు అనేవాడు ఉన్నాడా మరి ఉంటే నేను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుడుతాను అని దేవుడినే నిందిస్తారు. ఆరోగ్యవంతులు అంగవైకల్యంతో భాద, వేదన పడుతున్న వారిని చూచి ఏంటి దేవుడు వీరి జీవితాలతో ఆటలాడుకోవడం అని, ఎందుకు ఇలాంటివారికి దేవుడు జన్మనిస్తున్నాడు అని, ఎందుకు దేవుని మనస్సు ఇంత కటినమైనది అన్న మాటలతో దేవునిని నిందించే వారు లేకపోలేదు. మరి కొంత మంది అంగవైకల్యంతో పుట్టడానికి గత జన్మలో పాపం చేసారని, వారి కన్నవారు పాపం చేస్తే ఈ జన్మలో ఇలా అంగవైకల్యంగా పుట్టారని సమాజములో అనుకునే వారు కూడా లేకపోలేదు. ఇలా అంగవైకల్యంతో ఉన్నవారిని చూసి భాదపడుతూ, దేవునిని నిందిస్తూ చివరికి దేవుడే లేడనుకుంటున్నారు.

3) అంగవైకల్యం గలవారు ఆరోగ్యవంతుల స్థితిని చూచి భాదపడుతున్నారు అలానే ఆరోగ్యవంతులు అంగవైకల్యం గలవారి స్థితిని చూచి భాదపడుతున్నారు కానీ పరలోకపు దేవుడు మానవుల పాపపు స్థితిని చూసి భాదపడుతున్నాడనే విషయం మరచిపోయారు. అంగవైకల్యంతో ఉన్న అతి కొద్ది మందిని చూచి భాదపడుతున్నారు కానీ ఈ సృష్టిలో ఉన్న 700 కోట్ల మందికి జన్మనిచ్చిన పరలోకపు తండ్రి భాదను అర్థం చేసుకోవడం లేదు. మన కళ్ళ ముందు రెండు చేతులు లేనివాడిని చూసి అయ్యో అని భాదపడుతాము, కంటి చూపు కోల్పోయిన వారిని చూచి అయ్యో అని సానుభుతి వ్యక్త పరుస్తాముమరి ఏనాడైనా దేవుడు యొక్క వేదన స్థితిని ఆలోచించావా? చాలా మంది పరలోకంలో దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటున్నారు.

4) నోవాహు జల ప్రళయం ముందు దేవుని పరిస్థితిని చూస్తే ఎవరి విషయంలో భాదపడ్డాడో అర్థమవుతుంది. ఆదికాండ 6:5 - నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచ్చుకోనేను. నేడున్న పరిస్థితులు ఆనాటి చెడు పరిస్థితుల కంటే మార్పు ఉంటే దేవుడు ఆనందముగా ఉన్నాడు అని అనుకోవాలి. వాస్తవముగా ఇప్పటి పరిస్థితులు బొత్తిగా చెడిపోయాయి. నోవాహు కాలములో ఉన్న ప్రజల కన్న నేటి కాల ప్రజలు ఇంకా పాడైపోయారు. ఆనాడు తినుచు, త్రాగుచు సుఖిస్తున్న వారి విషయములో దేవుడు అంతగా భాదపడితే మరి ఈ రోజు ఉన్న మనుషుల విషయములో దేవుడు ఇంకెంత భాదపడుతున్నడో అర్థం కావాలి. దేవుని భాదను పట్టించుకోవడం లేదు కానీ కళ్ళ ముందు ఉన్న అంగవైకల్యం గల కొరకు అయ్యో అంటున్నారు.

5) అంగవైకల్యంతో పుట్టిన వారిని ఉద్దేశించి దేవునిని నిందించడం సరి కాదు. అంగవైకల్యంతో పుట్టిన వారందరిని దేవుడే పుట్టిస్తున్నాడని అనుకోకండి. అలా అనుకుంటే ప్రారంభములో దేవుడు ఆదాము హవ్వను కలిగించినప్పుడు అంగవైకల్యంతో చేసాడా లేక అంగవైకల్యం లేనివారిగా చేసాడా? ఇద్దరినీ ఆరోగ్యవంతులుగా, చావు అనేది లేనట్టుగా దేవుడు కలిగించగ వారు పాపము చేయుట ద్వారా మరణము అను జీతము పొందుకున్నారు. అనగా పాపము చేయుట వలన శరీరం కాస్త మృతమైన దేహముగా మారిపోయింది. దేహం మృతమైనదిగా మారాలి అంటే ఆ యొక్క శరీరంలో ఉన్న జన్యువులలో ఉన్న కణాలలో మార్పు జరిగిన దేహం కాస్త మృతమైన దేహముగా మారింది. అప్పటినుండిశరీరకణాలలో శరీర జన్యువులలో మార్పులు ప్రారంభమైనాయి. అక్కడ నుంచి వారి గర్భాన పుట్టబోతున్న వారందరికీ మార్పులు వచ్చాయి.

6) మనము తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకోకపోతే అంగవైకల్యముగానే పుడతారు. అందుకనే గర్భవతులను ఉద్దేశించి తరచుగా చెక్అప్ చేయించుకోవాలని,పుట్టిన బిడ్డలకు పోలియోవేయించుకోవాలని,తరచుగా అవసరమైన ఇంజక్షన్ వేసుకోవాలని,టైంకి మందులు వేసుకోవాలని ఇలా అనేక జాగ్రతలు చెప్తారు. పాటించవలసిన జాగ్రతలు నిర్లక్షముతో పాటించక శరీరంలోకి రోగం వచ్చే సరికి దేవా ఏంటి ఈ పరిస్థితులు అని దేవుడిని నిందిస్తున్నారు. మొదటిగా గర్భముతో ఉన్న తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు తీసుకోవాలి. అంగవైకల్యంతో పుట్టడందేవుని ఉద్దేశం అయితే ప్రకృతిలో ఇన్ని రకాల ఆహారాలను ఎందుకు పెడతాడు? నిజముగా ఇలా అంగవైకల్యంతో పుట్టగానే అందరి చూపు దేవుని వైపు వెళ్ళిపోతుంది. పుట్టక ముందు మరియు పుట్టిన తర్వాత ఒక తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు పిల్లల విషయములో తీసుకుంటే అప్పుడు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యముగా ఉంటాడు.

7) తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకున్న అంగవైకల్యంతో పుట్టినప్పుడు కంగారు పడవలసిన అవసరత లేదు. మోషే కూడా నత్తివాడు. నిర్గమ 4:10-నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అందుకు యెహోవా –మానవునకు నోరిచ్చువాడు ఎవడు? ముగ వానినేగాని, చెవిటి వానినేగానీ, దృష్టిగలవానినే గానీ, గ్రుడ్డి వానినే గానీ పుట్టించువాడేవడు? యెహోవానైన నేనే గదా.. మోషే బట్టి ఆలోచిస్తే అంగవైకల్యపు వారితో, అంగవైకల్యం లేని వారితో దేవునికి అవసరత ఉన్నదీ. అంగవైకల్యంతో ఉన్న మోషే యొక్క ఆత్మీయ స్థితి దేవునికి నచ్చింది కనుక ఆహారోనును కాక మోషేనే ఎన్నుకున్నాడు. మోషేలో ఉన్న ఓపిక,సహనం, సాత్వికం లాంటి గుణాలు వలన దేవుని చేత ఎన్నికింపబడ్డాడు. దేవుని పనికి ఆహోరోను కాక మోషేనే సరియైనవాడు అని ఎన్నుకున్నాడు. 

8) అంగవైకల్యంతో పుట్టిన వారమైన మేము దేవుని పనికి ఉపయోగం కాము అని అనుకోవడం సరి కాదు. అంగవైకల్యంతో ఉన్న వారు దేవునికి అవసరం లేదని వారిని చూస్తున్న మనము అనుకోకూడదు. మత్తయి 18:8- నీ చెయ్యి యైనను, నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ యెద్ద నుండి పారివేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగానో, అంగహినుడవుగానో జివములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని పెరికి నీ యెద్ద నుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటే ఒక కన్ను కలిగి జివములో ప్రవేశించుట నీకు మేలు. అనగా మనలో ఉన్న ఏ అవయవం అయితే చెడును జరిగించి, అభ్యంతరపరచి పాతాళమునకు నడిపిస్తుందో వాటిని పారివేయుము అని యేసు అంటున్నాడు. రోమా 6:13- మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నిజముగా అంగవైకల్యం గలవారికిఅవయవాలు లేనందుకు నరకం వెళ్ళడానికి అవకాశం తక్కువ. శరీరంలో ఏ అవయవం లేకపోయినా మిగిలిన అవయవాలుతో దేవుడు అప్పగించిన పని చేయవలసిన వారిగా ఉండాలి.

9) రోమా 9:20- ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు కీలాగు చేసితివని రూపింపబడినది రుపించువానితో చెప్పునా? దేవునిచే సృష్టించబడిన మనము తుదుకు దేవునినే అంగవైకల్యమును బట్టి నిండించటసరినా? కాదు. దేవుడు ఇచ్చిన అవయవాలతో దేవుని పని చేయాలి. ఆరోగ్యవంతుడిగా అవయవాలు అన్ని సరిగా ఉన్నను దేవుని పని చేయక నరకానికి వెళ్ళిపోతున్న వాడికన్న అంగవైలక్యంతో ఉన్నను దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళేవాడు చాలా గొప్పవాడు. వాస్తవముగా ఆలోచిస్తే పరలోకం వెళ్ళుటకు అంగవైకల్యం ఆటంకము కాదు. అంగవైకల్యం అనునది శరీరానికి సంభందించిందే కానీ ఆత్మకు సంభందించింది కాదు. కనుక అంగవైకల్యంతో ఈ లోకములో జివించినప్పటికి చనిపోయాక పరలోకానికి ప్రవేశించవచ్చు కానీ పాపంతో పరలోకానికి ప్రవేశించలేము.

10) పరలోకానికి అంగవైకల్యం ఆటంకము కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని జాగ్రతలు తీసుకున్నప్పుడు కూడా అంగవైకల్యంతో పుడితే భాదపడక దేవుని పనిలో ఉండగలిగితే లేక దేవునికి ఇష్టానుసారముగా ఉండగలిగితే ఆ మహాలోకమైన పరలోకానికి ప్రవేశించగలుగుతాము. అంగవైకల్యంతో ఉన్నను లేక లేకపోయినను దేవునిలోజీవించి- దేవునితో జీవించి-దేవునికై జీవించి- దేవునిలా జీవించి పరలోకానికి ప్రవేశించుదాము.

Wednesday, September 3, 2014

ఏమి లేనప్పుడు దేవుడెలా ఉన్నాడు?


1) మనుష్యలందరికీ మిగిలిపోయిన చిక్కు ప్రశ్న “దేవుడు అర్థము కాకపోవడము”. ఏమి లేనప్పుడు దేవుడు ఎలా పుట్టాడు అని అడుగుతారే కానీ, తన కుడి చెయ్యి గుప్పెడు మెతుకులతో తన నోటి వద్దకు ఎందుకు తీసుకోని వస్తుందో ఆలోచించలేడు. దేవుని గూర్చి రుజువులతో చూపించే శక్తీ ఒక్క బైబిల్ కు మాత్రమే ఉన్నది. చెట్టు ముందా లేక విత్తనము ముందా? కోడి ముందా గుడ్డు ముందా అని తలతిక్క ప్రశ్నలు అడుగుతుంటారు. చెట్టు రావాలంటే విత్తనము ఉండాలి, విత్తనము రావాలంటే చెట్టు ఉండాలి అంటూ ఎదుటి వారిని తిక మక పెడుతూ ఉంటారు. అదే విధముగా దేవుడు పుట్టాలి అంటే దేవుడు అమ్మ అన్న ఉండాలి లేక దేవుడికి తండ్రి అన్న ఉండాలి అంటారు.

2) కోడి ముందా గుడ్డు ముందా అనే వారికీ మనము వేయాల్సిన ప్రశ్న నువ్వు ముందా? మీ నాన్న ముందా? దీనికి ఖచ్చితముగా మా నన్నే ముందు అని సమాధానము చెప్పక తప్పదు. అనగా సృష్టిలో ఉన్న ప్రతిది కూడా చిన్నది పెద్దదాని నుండి రావలసిందే కాని చిన్న దాని నుండి పెద్దది ఎప్పటికి రాదు.చిన్నది ఎదుగుతూ పెద్దదానిగా మారుతుంది. ఈ విషయము గూర్చి బైబిల్ లో చూస్తే ఆదికాండ1:11,12- దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మిధ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మోలిపించును గాక అని పలకగా ఆప్రకారమాయెను. అనగా వృక్షములు మొదట మొలిచినవి ,వాటిలో గల ఫలములలో విత్తనాలు ఉన్నయి. ఈ విశ్వములో వృక్షములు భూమి మిద తప్పించి మరే గ్రహములో చెట్లు ఉండవు. ఇక్కడ మనము చాల జాగ్రతగా ఆలోచిస్తే ఈ భూమి మీదకు విత్తనములు వచ్చుటకు ఆ విత్తనములు కలిగిన చెట్లు ఎక్కడ ఉన్నాయి? అందుకనే మొదట దేవుడు చెట్లను కలిగించాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమనగా సృష్టిలో ఉన్నవన్నీ(మనతో సహా) వచ్చినవే గానీ ఉన్నవి కాదు.మనకంటే ముందే వచ్చేసాయి కాబట్టి మనకు సృష్టి అర్థము కావటము లేదు. మనకంటే ముందు ఈ సృష్టి జరిగినదని మనము ఎలా చెప్పగలం అంటే మనము ముందు చేయబడిన తర్వాత గాలిని చేసియుంటే ,గాలి లేక మనము చచ్చిపోయి ఉండేవారము. అందుకే తల్లి గర్భము నుండి భయటకు రాగానే మనకంటూ ముందే గాలి భూమి మిద ఉంటుంది. 

3) భుగర్భములో నుండి ఆదాము యొక్క మట్టి బొమ్మ భయటకు రాకముందే దేవుడు అన్ని వసతులు కలిగించి యుంచాడు. ఈ లోక వస్తువు వలెనే దేవుడు కూడా వచ్చిన వాడు కాదు. దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు ? దేవుడు చెబుతున్న సమాధానము నిర్గమ 3: 4- నేను ఉన్నవాడను,అనువాడను. అంటే నేను వచ్చిన వాడిని కాదు అని నేను ఉన్నవాడినిఅని చెబుతున్నాడు. ఉదాహరణకు:: నేను ఉన్నాను. నేను మా తండ్రి  నుండి వచ్చాను. మా తండ్రి  వాళ్ళ తండ్రి  నుండి వచ్చాడు. ఈ విధముగా వెనక్కి పోతే ఆఖరున చివరి ఎవరో ఒకాయన ఉండకపోడు. అందరి కంటే ఆఖరున(అనగా ప్రారంభములో) మిగిలిన వాడె దేవుడు. యెషయ 43:10,11- నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు.నా తరువాత ఏ దేవుడును ఉండదు. నేను నేనే యహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

4) అన్నిటికంటే ముందు ఉన్నవాడే నాకు ముందు ఎవరు లేరు అని అంటూ ఉంటె ,ఆఖరున పుట్టిన మనిషి దేవుడు ఎలా పుట్టాడు అంటాడు. దీనికి దేవుడు జవాబును యెషయ45:9లో చూడొచ్చు. దేవుడు చేస్తే కలిగిన వారము మనము. అయన పోమన్ని చెబితే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా! అ,ఆ లు రానివాడు పాటాలు చదివిన ఎలా గ్రహించలేడో అలానే దేవుడు గురించి, మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థము కాని వారికీ దేవుని విషయాలు కూడా అర్థము కాలేవు. దేవుని గూర్చి అర్థము కావాలంటే మన శరీర అవయవాల నిర్మాణము వాటి పనితీరు దగ్గర నుండి దేవుడు వరకు ఆలోచించాలి. 

5) మనిషికి దేవుడు అర్థంకాలేకపోయినా దేవుళ్ళును మాత్రము కలిపివేస్తూ అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు.మనము కలిపితే కలిసిపోవడానికి అయన( తండ్రియైన యెహోవా) నీళ్ళలో పాలను కుంటున్నారా? నిర్గమ 20:3,4- నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుడను. ఒకసారి ఈ వచనమును చదవండి. బైబిల్ నందు దేవుని మనస్సు తెలుసుకోక అందరి దేవుళ్ళు ఒక్కటే అనుట నిజం కాదు. యెషయ 44:24-యెహోవానాగు నేను సమస్తమును జరిగించువాడను. మనిషికి బ్రతుకు నేర్పించింది దేవుడే. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నుండి వచ్చాడు? అని ప్రశ్నించి తెలుసుకొనుట గుండుసూదితో మహా పర్వతాన్ని త్రావ్వినంత కష్టమైనదిగా భావించాలి. దేవుడు కలిగించిన మెదడు దేవుడుని ప్రశ్నిస్తున్నాడు.

6) దేవుడు కాలము లేని వాడు.( కీర్తన 102:27) .పరిమితి కలిగిన ఆయుష్షు ఉన్నవాడు కాదు. పూర్వ కాలము నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఈ విధముగా సేద్యపరచాలో అడమునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధముగా ఉండాలని, స్త్రీ ఈ విధముగా ఉండాలని కలగజేసింది ఆయనే. ప్రపంచములో అంత పురుషులో లేక స్త్రీలో ఉంటె మన సంగతి ఏమిటో ఆలోచించండి. ఆదికాండ 1:27-దేవుడు తన స్వరుపమందు నరుని సృజించెను.

7) మనిషి తన కళ్ళతో చుడలేనివి,తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నిటిని మైక్రొస్కోప్ (Microscope) లో చూసుకుంటున్నాడు మరి కొన్నిటిని హబుల్ టెలిస్కొపు(Habul Telecrope) లో చూసుకుంటున్నాడు. మరి దేవుని దేనితో చూడాలో తెలుసా? బైబిల్ నందు వ్రాయబడిన వాక్యముతో చూడాలి.దేవునికి జ్ఞానము మనవలె మట్టి మెడదు నుండి వచ్చింది కాదు. 1కోరంది2:11- ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యత్మకే కాని, ముష్యులలో మరి ఎవరికీ తెలియును?అలాగే దేవుని సంగతులు దేవుని అత్మకే గానీ మరి ఎవనికిని తెలియవు. కాబట్టి దేవుడు తన మాటలను, కార్యములను Translate చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్దాత్మను ఇచ్చియున్నాడు.

8) సూర్యుడు మండుచున్నాడు అంటే నమ్ముతున్నారు. నీరుగడ్డకడుతుంది అంటే నమ్మగలరు. కానీ కానీ దేవుడు ఉన్నాడు అంటే మాత్రమూ ఎందుకో నమ్మలేడు. మనకు వాలే దేవుడు వచ్చియుంటే అయన దేవుడు ఎలా అవుతాడు?? దేవుని గూర్చి బైబిల్ లో పూర్తిగా వ్రాయబడింది. బైబిల్ ముద్రణ యంత్రాన్ని కనుగొనిన తరువాత అచ్చు వేయబడిన మొదటి పుస్తకము ఇదే కాబట్టి చివరిగా మరొక మాట యోహాను 5:26 ను చదవండి.

9) దేవుడు ఒక మహాశక్తి కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు.శక్తికి పుట్టుక ఉన్నదా? చావు ఉన్నదా? శక్తిని గానీ, పదార్ధాన్ని గానీ పుట్టించలేము నాశనము చేయలేము. శక్తికి లింగ భేదము లేదు. శక్తికి పుట్టుక చవులు లేనట్లే దేవునికి కూడా లేవు. మరి ఈ శక్తులు దేవుని ఉనికిని తెలియజేస్తున్నాయి దేవుడు కలిగించిన శక్తీకే ఇంతటి ధర్మము ఉంటె దేవుడు కూడా నాశనము లేనివాడుగా మహా శక్తిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రుడుగా ఉన్నవాడు వచ్చివాడు కాదు. దేవుడు మరొక రూపము ధరించవలసిన అవసరము లేదు.

10) నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే దేవుడు. మాటలలో, క్రియల్లోనూ దైవత్వాన్ని చూపించేవాడు.ఆయనకు బ్రతుకును ఎవ్వరు ఇవ్వలేదు. 

11) దేవుడు ఎలా వచ్చాడో ఆలోచించుటకు ముందు మనము ఎలా వచ్చామో ఆలోచించండి. తల్లి గర్భములో నుండి వచ్చాము అంటారా? అది నిజమే. ఆ తల్లి గర్భాములోనికి ఎక్కడ నుండి వచ్చాము? తల్లి గర్భాములోనికి రాకముందు ఎక్కడో ఉన్నాము. ఎక్కడో చెప్పమంటారా? ఉన్నవాడైన దేవునిలో ఉన్నాము. కాబట్టి దేవుడు “ఉన్నవాడే” గానీ వచ్చినవాడు కాదు. లోకములో ఉన్నవి మనము మొదట ఆలోచిస్తే అర్థమైతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు.

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - II

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని, వారికీ(ముస్లింలు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి మోషే ముందుగా చెప్పబడింది అని ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. రెండవ భాగముగా(Second part) ఈ సందేశములో చుడండి.

1) (a) ఇంతకు బైబిల్లో మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అనే విషయము మనకు తెలియాలంటే ముందుగా ప్రవక్త అని ఎవరిని అంటారో తెలియాలి. ప్రవక్త అనగా ప్రభువు పంపగా వచ్చినవాడు, ప్రభువు పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు, దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తి అని. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రజలతో మాటలాడుచున్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా అని స్టార్ట్ చేయడం మనము చూస్తున్నాము. యెషయ 50:1-యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయ 66:1-యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యీర్మియా1:4- యెహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. పై వచనాలు బట్టి చూస్తే ప్రవక్త అంటే ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటించుట అని. 

(b)ఈ మధ్య కాలములో కొందరు తమ పేరులకు ముందు ప్రవక్త అని, మరికొందరు అపోస్తులడని పెట్టుకోవడము మనము చూస్తూ ఉంటాము. కానీ ప్రవక్తలనబడిన వారు ఎప్పటి వరకు ఉన్నారో అనే విషయాన్నీ బైబిల్లో చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే Luke16:16-యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులును ఉండిరి అని అంటున్నాడు. మొదటి శతాబ్దము వరకే ప్రవక్తలు ఉన్నారన్న విషయము అర్థమైతే తరువాత వచ్చిన వారు ఎవ్వరు ప్రవక్తలు కారనే సంగతి సులువుగా గ్రహించవచ్చు. అలా అయితే యేసు మాటను బట్టి( బైబిల్) క్రీస్తు తరువాత 500 years వచ్చిన మోహామోద్ ప్రవక్త అయ్యే అవకాశమే లేనప్పుడు “ఆ” ప్రవక్త కాగలడా?

(c) ముస్లిం సోదరులు ఏ మాటను అపార్ధము చేసుకుని బైబిల్లో లేని మోహామోద్ ను బైబిల్లో ఉన్నాడు అంటూ భ్రమపడుచున్నారో చూస్తే ద్వితియోప18:16,18,19.- (నీ) వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు ఉంచేదను. నేను అతనికి అజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పెను. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. పై మాటను ముస్లిం సోదరులు ఎలా వక్రికరించారంటే మోషే ఇశ్రాయేలీయులతో నీ సహోదరులలో నుండి అన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సహోదరులు ఇష్మాయేలీయులు కనుక మోషే చెప్పిన “ఆ” ఇష్మాయేలీయులలో నుండి రావాలి మరియు ఆ ప్రవక్త మాటే అందరు వినాలి ఆయనే మోహామోద్ ప్రవక్త అని వాక్యాన్ని అపార్ధము చేసుకున్నారు. 2 పేతురు 3:16- లేఖములను అపార్ధము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు.

(d)ఈ సందర్భములో మోషే మాటలాడుచున్నది ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ ఇష్మాయేలీయులు కొరకు కాదు. కారణము చూస్తే ఇశ్రాయేలీయులు అనగానే ఒక్కరు కాదు పన్నెండు గోత్రాలు ప్రజలు. ఒక గోత్రము వారు మరొక గోత్రపు వారికీ సహోదరులు అవుతారు. ఒక వేళ వారి (నీ) సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు గురించి అని అనుకుంటే ప్రతి సందర్భములో అలానే ఆలోచించాలి. ఉదాహరణ: ద్వితయో 17:15- నీ సహోధరులలోనే ఒకని నీ మిధ రాజుగా నియమించుకొనవలెను అను మాట ఉంది. పై మాటలో నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు అయితే ఇశ్రాయేలీయులపై రాజులూ ఎవరు ఉండాలి? ఇష్మాయేలీయులే ఉండాలి. అలా అయితే ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో ఒక్కరినైన ఇష్మాయేలీయుడను చూపించగలరా? లేదు. కారణము ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరు ఇశ్రాయేలీయులే( సౌలు, దావీదు, సోలోమోను, రెహబాము, యరోబము. ఇలా వీరు అందరు ఇశ్రాయేలీయులు.

(e) పై సందర్భమును బట్టి ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అనే విషయము స్పష్టమయింది. దేవుడు తన మాటలను తెలియజేయటానికి ప్రారంభము నుండి అనగా మోషే కాలము నుండి ఇశ్రాయేలీయులు(యూదులు)ను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా మనము బైబిల్ నందు చూడగలము. ఎక్కడైనా దేవుడు ఇష్మాయేలీయుల ద్వారా నా మాటలను తెలియజేయుదును అని అన్నట్లుగా మీరు చూపించగలరా? రోమ 3:1, యావేలు2:11, ఆమోసు 2:11, కీర్తన 147:19 ఇలా ఈ వచనాలలో చూడొచ్చు. ప్రవక్తలందరు ఇశ్రాయేలీయుల నుండి వచ్చారు, వస్తారు అనే విషయము మనకు అర్థమవుచున్నది గనుక ఆ మాటలన్నిటిని బట్టి మోహామోద్ “ఆ” ప్రవక్త అయ్యే అవకాశమే లేదు.

(f) ఇప్పటివరకు “ఆ “ ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అని. మరి ఎవరు “ఆ ప్రవక్త? యేసుక్రీస్తు(రాక) విషయమై ఎన్నో ప్రవచన లేఖనములు ధర్మశాస్త్రములోను, కీర్తన గ్రంధములోను, ప్రవక్తల గ్రంధములోను మనము చూడగలము ( యోహాను 1:45, లూకా 24:44) . ఈ వచనములో యేసుక్రిస్తే స్వయంగా నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రములోనువ్రాయబడింది అని చెబుతున్నాడు అంటే ఒక వేళ మోషే ద్వితియొపదేశకాండంలో చెప్పిన “ఆ” ప్రవక్త యేసు కావచ్చు కదా!

యేసు ప్రవక్తా?

2) (a)హెబ్రీ 1:12- పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియజేయువాడే ప్రవక్త అని ముందు మాటల్లో మీరు చదివారు. ఇప్పుడు యేసును కూడా ప్రవక్తగా మనము చెప్పుటలో తప్పు లేదు. యోహాను 12:49,50, 17:7,8:26,7:16 లో చూడొచ్చు. తండ్రియైన దేవుడు తెలియజేసిన( చెప్పమన్న) సంగతులు కాక యేసు మరేమియు చెప్పలేదని అనగా ఒకనాటి ప్రవక్తల వలె యేసు కూడా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా యుండి ప్రజలకు దేవుని మాటలు తెలియజేసారు. కావున యేసు “ప్రవక్త” . యేసు ప్రవక్త అనుటకు బైబిల్లో మరికొన్ని మాటలను మనము చూస్తే యోహాను 4:19, 9:17, లూకా 24:19,మత్తాయి 21:11,21:46, లూకా 7:15,16.

(b) పై వ్రాయబడిన వచనాలు అన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు స్పష్టముగా అర్థమయింది. యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పినంత మాత్రమున అయన దేవుడు కాదు, దైవ కుమారుడు కాడు అని నేను చెప్పుట లేదు. 

(c) ఒక ఆఫీసర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా పిలువబడతాడు. ఇంటిలో ఉన్నప్పుడు భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లితండ్రులకు కుమారుడిగా, అన్నకు తమ్ముడిగా పిలువబడుతాడు. ఒక వ్యక్తే ఇన్ని విధములుగా పిలువబడుచున్నాడు. ఇది సరియైనదే అలానే యేసుక్రీస్తు ప్రవక్తగా, దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయనకున్న లక్షణాలను బట్టి మనకు అర్థమవుచున్నది. యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు అర్థమయింది కాని యేసుక్రీస్తు “ ఆ ప్రవక్త నా?

యేసు “ఆ” ప్రవక్తనా?

(3) (a)యేసుక్రీస్తు ఆ ప్రవక్త అనుటకు మనకున్న లేఖన ఆధారములలో కొన్నిటిని మనము ఆలోచన చేయ గలిగితే “ఆ ప్రవక్త ఇశ్రాయేలు గోత్రాలలో ఏదో ఒక గోత్రము నుండి రావాలి. యేసుక్రీస్తు ముమ్మాటికి ఇశ్రాయేలియుడే. రోమా 9:4, మత్తాయి 1:1, మత్తాయి 2:2, రోమా1:7, 2 తిమోతి 2:8లో చూడొచ్చు. ఈ కొన్ని లేఖనాదారాలను బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానముగా అనగా యుదా వంశము నుండి వచ్చాడు అనే విషయము అర్థమవుచున్నది. యోహాను 6:14- లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యోహాను 7:40- నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి.

(b) ఇదంతా చదివిన తరువాత ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారు ఇది ప్రజలిచ్చిన సాక్షం కనుక చెల్లదు అనవచ్చు. ఎందుకనగా క్రిస్తుపైనే వారికీ సరియైన అబిప్రాయము లేదు. కారణము మనసంతా మోహామోద్ తో నిండికొనియుంది. అపోకార్య3:22,23లో పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నారో బైబిల్ పై కనీస జ్ఞానముయున్న ఎవరైనా సులువుగా గ్రహించగలరు. 

(c) ముస్లిం సోదరులులు యేసును నమ్ముతాము. అయన అంటే మాకు గౌరవము అంటున్నప్పుడు అయన చెప్పిన ప్రతి మాట నమ్మాలి. అయన చెప్పిన ప్రతిది చేయాలి. వారికీ అనుకూలముగా ఉన్నవాటిని నమ్మి మిగిలినవి వదిలేయడము మహానుభావుడైన యేసును ఆగౌరవపరచడమే అవుతుంది.

(d) మోషే గారు నా వంటి ఒక ప్రవాక్తను అన్నారు కదా . మోషేకి పెళ్లి అయింది కదా మరి యేసు కు కాలేదు అని అంటున్నారు. మోషే లాంటి ప్రవక్త అనగానే వయస్సు, వివాహము, పిల్లలు కాదు ఆలోచించాల్సింది. లక్షణాలు కావాలి. దేవుడు అనగానే ఎలా గుణ లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటామో అలానే మోషే లాంటి లక్షణాలు కలిగినవాడు అని అర్థము. మోషేను గూర్చి దేవుడే పలికిన మాటలను చూస్తే (సంఖ్యా 12:3,సంఖ్యా 12:7). ఇవే లక్షణాలు తిరిగి మనము స్పష్టముగా ఎసుక్రిస్తులో చూడగలము.

CONCLUSION: మోషే లాంటి వాడు యేసుక్రీస్తు కాని మోహామోద్ కాదు. “ఆ ప్రవక్త ఇశ్రాయేలులో నుండే రావాలి ప్రవక్తలందరు ఇశ్రాయేలియులే సహోదరులు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారే ప్రజలు, అపోస్తులలు పౌలు గారి ఇచ్చిన వ్రాసిన సాక్షాన్ని బట్టి యేసునే “ఆ ప్రవక్త” యేసు తరువాత సుమారు 500 years కి వచ్చిన మోహామోద్ “ఆ “ ప్రవక్త అనుకోవడము ఇస్లాము సోదరుల భ్రమ.--> మోహామోద్ ఇశ్రాయేలియుడై కానప్పుడు ప్రవక్త కాదు. ఆ ప్రవక్త అస్సలు కాదు.