Friday, May 9, 2014

యేసుక్రీస్తు ఎవరు?

అటు Christians లోను, ఇటు Non-Christians విషయములోను యేసు గురించి ఒక ఏకాభిప్రాయాము లేదు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎవరు యేసుక్రీస్తు ?అయన ఉనికి ఏంటి? అన్న విషయము పై దేవుని మనస్సు అయిన గ్రంధములో పరిశోధన చేద్దాము ఇప్పుడు. ముందుగా అయన ఉనికిని ఆలోచిస్తే అనగా అయన ఎప్పటి నుండి ఉన్నవాడో తెలుసుకోవాలి. ఈ ప్రపంచానికి కేవలము కన్యక గర్బమున ద్వార వచ్చెనని తెలుసు. ఈ లోకానికి వచ్చాడు కనుక కాబట్టి ఉన్నవాడు అని అంటున్నారు ,కానీ ఈ లోకానికి రాకముందే ఉన్నవాడే అన్న సంగతి ప్రపంచమునకి తెలియదు.

1) John 8:57,58 లో అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అంటున్నాడు .. ఇంతకు ఎక్కడ ఉన్నాడు? అంటే భూమి మీదకు రాకముందు పరలోకములో ఉన్నాడు( సామెతలు 8:26). సామెతలు 8:30 లో నేను అయన ( తండ్రి) దగ్గర ఉన్నాను.నిత్యము అయన సన్నిధీలో ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు చరిత్ర ఈ లోకానికి వచ్చాక start అయింది అంటే పొరపాటు. యేసుక్రీస్తు ఉన్నవాడు. అబ్రహాము, ఈ సృష్టి పుట్టాకముందే ఉన్నవాడు. పరలోకములో ఉన్నవాడు. పరలోకములో దేవుని యెద్ద ఉన్నవాడు. john 1:1 లో ఆయనలో ఉన్నాడా? అయన వద్ద ఉన్నాడా? యేసు తండ్రి వద్ద ఉన్నాడు.

example:: నాకు పెళ్లి అయ్యి కుమారుడు పుట్టనంత వరకు నాలో ఉంటాడు. పుట్టిన తర్వాత నా యెద్ద ఉంటాడు. యేసు పరలోకములో పుట్టాడు.పుట్టిన అయన తండ్రి యెద్ద ఉన్నాడు.అయన యెద్ద ఉన్న యేసు శారిరధారిగా మరియ గర్భమున ఈ లోకానికి వచ్చాడు. ఇంతవరకు ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడన్న వివరణ మనకు ఇంతవరకు తెలుసుకున్నాము. 

2) ఇంతకు అయన ఎవరు?

ఈ రోజు యేసుక్రీస్తు ఎవరు అన్న విషయము పై భిన్నమైన వాదనలు ఉన్నాయి. non-christians నీ అడిగితే ఈయన మహానాయకుడు అని, పుట్టిన మహాను భావులలో ఈయన ఒకడని, ఒక మత నాయకుడని, మేధావుడని,  తత్వవేత్తుడని, మత వ్యవస్థాపకుడు అని జవాబు ఇస్తున్నారు. christians నీ అడిగితే ఈయనే తండ్రి అని, పరిశుద్దాత్మ అని జవాబు ఇస్తున్నారు.

3) యేసు కాలములో ఉన్నవారికి యేసుక్రీస్తు అర్థముకాలేదు. ఎవరు అన్న విషయము పై భిన్నముగా మాట్లాడుకున్నారు.

a) మత్తయి 13:55,56 లో శాస్త్రులు ,పరిసయ్యులు -ఈయన వడ్ల వాని కుమారుడు అని అంటున్నారు.
b) Luke 7:33లో తిండిబోతు అని అంటున్నారు.
c) Mark3:20 లో యేసు ఇంటి వారు –మతి చేలించింది అంటున్నారు( mental fellow)
d) Mark3:22 లో యేరుషలేము నుంచి వచ్చిన శాస్త్రులు-దయ్యలా అధిపతి అని అంటున్నారు.
e) Mark 4:35లో యేసు శిష్యులు – ఈయన ఎవరో... అంటున్నారు

4) మత్తయి 16:13లో శిష్యులను మీరు నా గురించి ఏమి అనుకుంటున్నారు అంటే అందుకు పేతురు “దేవుని కుమారుడవైన క్రీస్తు” అని జవాబు ఇచ్చాడు. అందుకు యేసు నీవు ధన్యుడవు అంటున్నాడు. అలానే మత్తయి 3:16 లో పరలోకపు తండ్రి చెప్పుచున్నాడు యేసు క్రీస్తు ఎవరో అని – “ప్రియ కుమారుడని”. అంటే యేసు తండ్రికి కుమారుడు.. Mark 5:6,7 లో దెయ్యము చెప్పుతున్నాడు యేసు ఎవరో అని- ఈయన “సర్వోన్నతుడైన దేవుని కుమారుడని”.

5) దేవుడు కుమారుడే కాక దేవుడై ఉన్నాడు.కుమారుడైన యేసు క్రీస్తు దేవుడు. John 10:33,34లో నీవూ మనుష్యుడవు అయ్యి ఉండి దేవుడని చెప్పుకోనుచున్నావు... యేసు దేవుని కుమారుడు and అదే సమయములో దేవుడు కూడా.కానీ యేసే దేవుడు అని చెప్పటము తప్పు. ధీని అర్థము ఇంకా ఎవ్వరు లేరు అని. మరి ఈయన కన్న అయన ఉన్నాడుగా?? తండ్రి ఉన్నాడు . కుమారుడుగా యేసు కూడా ఉన్నాడు.

6) యేసు గురించి దేవుని కుమారుడిగా,దేవుడిగా చెప్పటము correct and ప్రవక్త అని చెప్పటము కూడా correct. ప్రవక్త అనగా తండ్రికి, ప్రజలకు మధ్యవర్తి అని. దేవుని మాటలు ప్రజలకు చెప్పేవాడు ప్రవక్త. యేసుక్రీస్తు ఈ పనే చేసాడు. నా తండ్రి దగ్గర విన్న సంగతులు తప్ప నేను ఏమి చెప్పడము లేదు అన్నాడు. యేసు క్రీస్తు చెప్పిన ప్రతి మాట,సంగతులు తండ్రి చెప్పమన్నాడు. తండ్రి చెప్పమన్నది చెప్పాడు గనుక ఈయన ప్రవక్త కూడా.

7) ప్రవక్తగా, కుమారుడిగా, దేవుడిగా యేసుక్రీస్తు మనకు కనపడుచున్నాడు. అది ఏంటి ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా ఉన్నారు అంటే example::: నీ గురించి- ఇంటికి రాగానే భార్య husband అని, పిల్లలు daddy అని, parents కుమారుడని,ఆఫీసులో sir అని పిలుస్తున్నారు. ఒక్కడే వ్యక్తి రకరకాలుగా సమయాన్ని ,సందర్బాన్ని బట్టి, దేవుడు గా, కుమారుడిగా,సందర్బాన్ని బట్టి ప్రవక్త గా చెప్పటములో తప్పులేదు.

No comments:

Post a Comment